భోగరాజు పట్టాభి సీతారామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
===ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఉద్యమానికి కృషి===
తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని దాని కొరకు పట్టాభి ఎంతగానో కృషిచేశాడు. పట్టాభి చొరవతోనే ఆంధ్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ [[1908]] లో బందరులో జరిగింది. బందరు సమావేశంలో తెలుగు జిల్లాల ప్రముఖులందరూ సమావేశమై ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి చర్చించినారు. ఆ తరువాతనే [[1913]] లో [[బాపట్ల]] లో తొలి ఆంధ్రమహాసభ జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకత గురించి పట్టాభి ఆంగ్లంలో ఒక గ్రంథమే రచించినాడు. పట్టాభి కృషి వల్లనే [[1920]] లో కాంగ్రెసు పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సూచనప్రాయంగా ఆమోదించింది.
===వ్యాపారవేత్తగా===
పట్టాభి సీతారామయ్య ఎన్నో ఆర్థిక సంస్థలను స్థాపించాడు. [[ఆంధ్రా బ్యాంకు]] ([[1923]] లో స్థాపన), ఆంధ్రా ఇన్స్యూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంకు, కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదలగునవి స్థాపించాడు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు. చిన్న మొత్తంలో డిపాజిట్లు సేకరించి పొదుపును ప్రోత్సహించాడు.
===తెలుగు అభిమానిగా===
ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసమే కాకుండా తెలుగు జిల్లాలలో తెలుగు వాడకాన్ని పట్టాభి ఎంతగానో ప్రోత్సహించినాడు. తాను స్థాపించిన సంస్థలన్నింటిలోనూ తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు తెలుగులోనే జరగాలని నియమం పెట్టి ఆచరించాడు. ఆయన వేష, భాషల్లో ఎప్పుడూ తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది. అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు అయిననూ, గవర్నర్‌గా మధ్య ప్రదేశ్ వెళ్ళిననూ వేష, భాషల్లో మార్పు రాలేదు.
===గ్రంథకర్తగా===
 
==గ్రంథకర్తగా==
పట్టాభి రచించిన గ్రంథాలలో '''కాంగ్రెసు చరిత్ర''' (''History of Indian National Congress'') అన్నింటికంటే ప్రధానమైనది. సుమారు 1600 పుటల కాంగ్రెసు చరిత్రను కేవలం 2 మాసాలలో పూర్తిచేశాడు. అందులోనూ దానికి ఆధారంగా తీసుకున్న గ్రంథాలు చాలా తక్కువ. కేవలం తన జ్ఞాపక శక్తితో వ్రాసి సంచలనం సృష్టించాడు. గ్రంథకర్తగా ఆయన సుప్రసిద్ధ కాంగ్రెస్ చరిత్రతో పాటుగా మన నేత పరిశ్రమ వంటి పుస్తకాలను కూడా రచించారు.<ref>{{cite book|last1=పట్టాభి సీతారామయ్య|first1=భోగరాజు|title=మన నేత పరిశ్రమ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Mana%20Netha%20%20Prarishra&author1=B.P.Seetha%20Ramaiya&subject1=-&year=1931%20&language1=telugu&pages=66&barcode=2020120000873&author2=&identifier1=&publisher1=T.RAMA%20RAO&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/872|accessdate=13 January 2015}}</ref>
 
===స్వాతంత్రానంతరం===
==స్వాతంత్ర్యానంతరం==
స్వాతంత్ర్యంస్వాతంత్రo తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత [[1952]] లో [[రాజ్యసభ]] సభ్యునిగా ఎన్నికై [[పార్లమెంటు]] లో ప్రవేశించినాడు. [[1952]] నుండి [[1957]] వరకు [[మధ్య ప్రదేశ్]] గవర్నరుగా పని చేశాడు.
 
== =మరణం ==
తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభి [[1959]], [[డిసెంబర్ 17]]న స్వర్గస్థుడయ్యాడు.