భీమ్స్ సెసిరోలియో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''భీమ్స్ ''' గా పిలువబడే '''భీమ్స్ సెసిరోలియో ''' ఒక తెలుగు సినీ సంగీత దర్శకుడు మరియు గీత రచయిత. పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించాడు.
==నేపధ్యము==
వీరి పూర్వీకులది రాజస్థాన్ రాష్ట్రము. వీరు [[ఖమ్మం జిల్లా]] లో స్థిరపడ్డారు. భీమ్స్ విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. ఇతడు తెలుగు భాషను చిన్నప్పటినుండి అభ్యసించడం వలన భాషపై మంచి పట్టు వచ్చింది. తొలుత గీతరచయితగా సినీ రంగంలో తన ప్రస్థానం ప్రారంభించాడు. [[ఆయుధం]] సినిమాలో '''ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే ''' అనే పాటను రాశాడు. ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మార్చుకుని [[నువ్వా నేనా (2012 సినిమా)|నువ్వా నేనా]] సినిమాకి సంగీతాన్ని అందించాడు. అందులోనే '''వయ్యారి బ్లాక్ బెర్రీ ''' అనే పాటను ఆలపించాడు. ఈ పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత [[గాలిపటం (సినిమా)|గాలిపటం]] , [[బెంగాల్ టైగర్ (సినిమా})|బెంగాల్ టైగర్]] సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతని సంగీతంలోని నవ్యత ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇతడికి మంచి భవిష్యత్తు ఉన్నదని ప్రేక్షకుల అభిప్రాయము.
 
==సంగీతదర్శకత్వం వహించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/భీమ్స్_సెసిరోలియో" నుండి వెలికితీశారు