ఓలేటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఆయన [[1928]] [[ఆగష్టు 27]] న తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో నరసింహారావు, అచ్చికాసులు దంపతులకు జన్మించారు. గుడివాడలో చతుర్వేదుల అచ్యుతరామశాస్త్రి వద్ద సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు. 1935 లో [[కాకినాడ]] లో మునుగంటి వెంకటరావు పంతులు గారు నడుతుపున్న శ్రీరామగాన సమాజంలొ చేరి పది సంవత్సరాలు సంగీతాభ్యసన చేసారు. 1950లో శ్రీపాద పినాకపాణి వద్ద నాల్గు సంవత్సరాలు సంగీతాన్ని నేర్చుకున్నారు. ముఖ్యంగా తంజావూరు బాణీని గ్రహించారు.<ref>[http://www.carnaticcorner.com/articles/voleti.htm Voleti Venkateswarulu (1928-89)]</ref>
==ఆకాశవాణి లో==
ఆయన 1956లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ప్రొడ్యూసరుగా సంగీత శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన "సంగీత శిక్షణ" అనే ముఖ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మూర్తి త్రయంతోపాటు సుబ్రహ్మణ్య అయ్యర్, పూచి శ్రీనివాస్ అయ్యంగార్, పొన్నై పిళ్ళై వంటి విధ్వాంసుల కృతులతోనూ, అన్నమాచార్య కీర్యనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థులవారి తరంగాలు సాంప్రదాయ శైలిలో బోధించారు. విజయవాడ కేంద్ర కార్యక్రమాలలో ప్రసిద్ధి చెందిన "భక్తిరంజని" కార్యక్రమంలో త్యాగరాజు దివ్యనామ కీర్యనలు, తూము నరసింహదాసు కీర్తనలు, రామదాసు కీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, కర్ణాటక సంగీతం లోని బాణీని విడువకుండా చక్కని సాంప్రదాయ శైలిలో పాడేవారు.<ref>[http://www.carnaticcorner.com/articles/voleti.htm Voleti Venkateswarulu (1928-89)]</ref>
 
==మూలాలు==