అమృతా షేర్-గిల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
1934 నాటికల్లా, అమృతా మనస్సులో తను భారతదేశం తిరిగిరావాలని, ఇక్కడి స్థానికతను ప్రతిబింబించేలా తన వృత్తి ఉండాలనే కోరికలు బలీయమైనాయి. తన తుది శ్వాస దాకా అమృత వీటిపైనే పని చేశారు. 1935లో అమృత ఆంగ్ల విలేఖరి మాల్కం మగ్గరిడ్జ్ ను [[షిమ్లా]]లో కలిసినది. తన ప్రేమికుడి చిత్రపటాన్ని అమృతా వేసినది. వారు కొంతకాలం సహజీవనం చేశారు. కార్ల్ ఖండాల్వాలా ఆమె భారతీయ మూలాలను కనుగొనమని ఇచ్చిన స్ఫూర్తితో ఆమె యాత్రలు మొదలుపెట్టినది. చిత్రకళలో [[అజంతా]], [[ముఘల్]], [[పహారీ]] శైలులకు ముగ్ధురాలైనది.
 
1937 లో [[దక్షిణ భారతదేశం]] బయలుదేరినది. Bride's Toilet, Brahmacharis మరియు South Indian Villagers Going to Market ఆమె కుంచె నుండి జాలువారినది అప్పుడే. శాస్త్రీయ భారతదేశపు కళ వైపే ఆమె అధిక శ్రద్ధ చూపేది. అప్పటి వరకు పేదరికం, నిరాశలు మాత్రమే తొణికిసలాడే భారతీయ చిత్రకళను, ఈ చిత్రపటాలతో ఆమె వర్ణాల పట్ల, భారతీయ సూక్ష్మాల పట్ల దాగి ఉన్న భావోద్వేగాలతో నింపివేసినది. ఈ సమయానికల్లా అమృతా వృత్తిలో పరివర్తన వచ్చినది. తన కళాత్మక ధ్యేయం, భారతీయ ప్రజల జీవన విధానాన్ని తన కాన్వాస్ ద్వారా వ్యక్తపరచటంగా దిశానిర్దేశం చేసుకొన్నది. ఒకానొక లేఖలో అమృతా ఈ విధంగా పేర్కొన్నది.
 
నేను భారతదేశం లో మాత్రమే చిత్రపటాలను వేయగలను. [[ఐరోపా]] పికాసో, మాటిస్సే, బ్రేక్వీకి చెందినది... కానీ భారతదేశం, నాకు మాత్రమే చెందినది.
 
భారతదేశంలో తన మజిలీ తనలోని కళను కొత్త పుంతలను త్రొక్కించినది. యుద్ధం జరుగుతున్నప్పుడు తాను ఐరోపాలో ఉన్నప్పటి కళకి, ప్రత్యేకించి హంగేరీ చిత్రకారుల ప్రభావం ఉన్న తన కళకీ; ఈ కళకీ చాలా వ్యత్యాసం ఉన్నట్లు అమృతా గుర్తించినది.
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/అమృతా_షేర్-గిల్" నుండి వెలికితీశారు