సాహిత్యాకాశంలో సగం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''సాహిత్యాకాశంలో సగం''' తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం. దీనిని [[కాత్యాయని విద్మహే]] వ్రాసారు.
==రచయిత గూర్చి==
{{main|కాత్యాయని విద్మహే}}
ఆమె వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు డిపార్ట్మెం ట్లో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దేశంలోని 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి సాహిత్య అకాడమి డిసెంబర్ 18న ఎంపిక చేసింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా' రాసిన బాలీవుడ్కు రచయిత జావేద్ అక్తర్, 'మిల్జుల్ మన్' రాసిన హిందీ నవలా రచయిత్రి మృదులా గార్గ్ ఉన్నారు. 2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు.<ref>[http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf ఆధ్రజ్యోతి లో పురస్కార విశేషాలు]</ref>
==విశేషాలు==
కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’లో 28 వ్యాసాలు ఉన్నాయి. ఇది 2010లో వెలువడింది. ‘రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం’, ‘ప్రాచీన సాహిత్యం- మరోచూపు’ తదితర వ్యాసాలు ఉన్నాయి. కట్టుబాట్లను ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ, విమల తదితరులు చేసిన రచనలను కాత్యాయని విశ్లేషించారు. పుస్తకాలను అర్థం చేసుకోవడానికి, పఠనానుభూతిని ఇతరులతో పంచుకోవడానికి తాను రచనలు చేశానని ఆమె బుధవారం విలేకర్లతో అన్నారు. వరంగల్ జిల్లా నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వారిలో కాత్యాయని రెండోవారు. జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్కు 2004లో ఈ అవార్డు వచ్చింది.<ref>[http://www.sakshi.com/news/national/literary-award-to-kathyam-89784 కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు Sakshi | Updated: December 19, 2013]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|