సాహిత్యాకాశంలో సగం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2010 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
{{main|కాత్యాయని విద్మహే}}
ఆమె వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు డిపార్ట్‌మెం ట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి సాహిత్య అకాడమి డిసెంబర్ 18న ఎంపిక చేసింది. ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా' రాసిన బాలీవుడ్‌కు రచయిత జావేద్ అక్తర్, 'మిల్‌జుల్ మన్' రాసిన హిందీ నవలా రచయిత్రి మృదులా గార్గ్ ఉన్నారు. 2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరిస్తారు.<ref>[http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf ఆధ్రజ్యోతి లో పురస్కార విశేషాలు]</ref>
==నేపథ్యం==
పుస్తకంలోని ఆరు వ్యాసాలు స్త్రీల సాహిత్యానికి సంబంధించిన సిద్ధాంత నేపథ్యాన్ని, స్త్రీల సాహిత్యాన్ని గుంపుగా అధ్యయనం చేయటాన్ని తెలియజేస్తాయి. తక్కినవి పది వ్యాసాలు స్త్రీల కవిత్వాన్ని, పన్నెండు వ్యాసాలు స్త్రీల కథల్ని విశ్లేషించాయి. కాత్యాయని ప్రధానంగా కల్పనా సాహిత్య విమర్శకులయినా స్త్రీల కవిత్వాన్ని కూడా విశ్లేషించారు. స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించింది చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో. ఆ వర్ణన ఆధారంగా ఓల్గా ‘ఆకాశంలో సగం’ అనే నవల రాయగా, కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’ అనే విమర్శ గ్రంథం రాశారు. ఈ విమర్శగ్రంథంలోని వ్యాసాలు 1984-2010 మధ్య రెండున్నర దశాబ్దాలలో సదస్సుల కోసం రాసినవి కొన్ని, పత్రికల కోసం రాసినవి ఇంకొన్ని, పుస్తకాలకు రాసిన ముందుమాటలు మరికొన్ని. ఈ వ్యాసాలు స్త్రీవాదం తెలుగులో ప్రారంభమౌతున్న దశలో మొదలై అది స్థిరమైన సిద్ధాంతంగా రూపొంది సామాజిక ఆమోదం పొందే దాకా రాశారు కాత్యాయని. సామాజిక పరిణామ క్రమానికి ప్రాతినిధ్యం వహించే ఈ వ్యాస సంపుటి స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఒక దిక్సూచి, ఒక కరదీపిక.<ref>[http://sarasabharati-vuyyuru.com/2014/03/10/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%97%E0%B0%82-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D/ సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి]</ref>
==విశేషాలు==
కేంద్ర సాహిత్య అకాడమీ గెలుచుకున్న కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’లో 28 వ్యాసాలు ఉన్నాయి. ఇది 2010లో వెలువడింది. ‘రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో స్త్రీల సాహిత్య అధ్యయనం’, ‘ప్రాచీన సాహిత్యం- మరోచూపు’ తదితర వ్యాసాలు ఉన్నాయి. కట్టుబాట్లను ప్రశ్నిస్తూ రంగనాయకమ్మ, విమల తదితరులు చేసిన రచనలను కాత్యాయని విశ్లేషించారు. పుస్తకాలను అర్థం చేసుకోవడానికి, పఠనానుభూతిని ఇతరులతో పంచుకోవడానికి తాను రచనలు చేశానని ఆమె బుధవారం విలేకర్లతో అన్నారు. వరంగల్ జిల్లా నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న వారిలో కాత్యాయని రెండోవారు. జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత ‘అంపశయ్య’ నవీన్‌కు 2004లో ఈ అవార్డు వచ్చింది.<ref>[http://www.sakshi.com/news/national/literary-award-to-kathyam-89784 కాత్యాయనికి కేంద్ర సాహిత్య అవార్డు Sakshi | Updated: December 19, 2013]</ref>
"https://te.wikipedia.org/wiki/సాహిత్యాకాశంలో_సగం" నుండి వెలికితీశారు