ఆంధ్రుల సాంఘిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28:
'''ఆంధ్రుల సాంఘిక చరిత్ర''' గ్రంథాన్ని ప్రముఖ సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత [[సురవరం ప్రతాపరెడ్డి]] సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.
== రచన నేపథ్యం ==
దీన్ని 1949 లో మొదటిసారి [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]] ప్రకటించింది. ఆ తరువాత ఈ గ్రంథాన్ని అనేక ముద్రణల తరువాత [[విశాలాంధ్ర]] తిరిగి ముద్రించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ భాషలకు ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంథానికి ఇచ్చింది. ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ఆటపాటలు మొదలైన వాటికి చోటు ఇచ్చింది. అనేక భారతీయ భాషల లోకి ఇది అనువాదమైంది. దీనిని [[సురవరము ప్రతాపరెడ్డి]] సాహిత్య వైజయంతి, హైదరాబాదు వారు 1982 సంవత్సరంలో మూడవసారి 2000 కాపీలు ముద్రించారు.<br />
ప్రతాపరెడ్డి గ్రంథానికి ముందుమాటలో తనకు పూర్వమే ఈ విషయాన్ని భావన చేసి అలాంటి ప్రయత్నాలు చేసినవారి పేర్లు ప్రస్తావించారు. [[చిలుకూరి వీరభద్రరావు]] తన [[ఆంధ్రుల చరిత్రము]] గ్రంథంలోని వెలమవీరుల చరిత్ర ప్రకరణంలో పుట అడుగున "ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రత్యేకంగా విరచింపబడుతున్నది. కావున ఈ విషయమై(వెలమాది జాతుల సంగతి) అందు సవిస్తరంగా చర్చింపబడుతున్నది" అన్నారు.<ref>ఆంధ్రుల చరిత్రము:చిలుకూరి వీరభద్రరావు:వెలమవీరుల చరిత్ర ప్రకరణం ప్రారంభంలో</ref> దాని ఆధారంగా చూస్తే వీరభద్రరావు కొంతవరకూ ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసే ప్రయత్నం ప్రారంభించి ఏవో కారణాంతరాల వల్ల నిలిపివేసి ఉండొచ్చని ప్రతాపరెడ్డి భావించారు.<ref name="first edition foreward">ఆంధ్రుల సాంఘిక చరిత్ర:సురవరం ప్రతాపరెడ్డి:ప్రథమ ముద్రణ పీఠికలో</ref> ఆంధ్రుల సాంఘిక చరిత్రకు సంబంధించి ప్రఖ్యాత చారిత్రికులు [[నేలటూరి వెంకట రమణయ్య]] ఆంగ్లవ్యాసం రచిస్తే, [[మల్లంపల్లి సోమశేఖర శర్మ]] తమ [[రెడ్డి రాజ్యాల చరిత్ర]]లో సాంఘిక చరిత్రను కూడా చేర్చారు. ఇలా కొందరు చారిత్రికులు ఆ ఆలోచన ప్రతిపాదించి, మరికొందరు కొంత కృషిచేసినా పూర్తిస్థాయిలో ఆంధ్రుల సాంఘిక జీవన చరిత్ర రచనలో ఇదే మొదటి గ్రంథంగా పేర్కొంటున్నారు.