తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
తాను చదువుకొన్న బందరు జాతీయ కళాశాలలో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన [[మరుపూరు కోదండరామిరెడ్డి]], వై.బి.రెడ్డి, [[బెజవాడ గోపాలరెడ్డి]], కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందాడు. కర్నూలులో వెల్లాల శంకరశాస్త్రి ఇతని ప్రియశిష్యుడు. బందరు జాతీయ కళాశాలలో [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇతనికి సహాధ్యాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ కుమారుడైన అర్జునరావుకు ఇతడు సంస్కృతం నేర్పించాడు. 1921లో బెజవాడలో గాంధీని దర్శించాడు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుననుసరించి ఖద్దరును ధరించాడు.
 
1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి గద్వాల రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డాడు. [[వనపర్తి]], [[ఆత్మకూరు]], [[కొల్లాపురం]] సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డాడు. ఇతడు గద్వాల మహారాణికి ఆంతరంగికుడు. గద్వాల రాణికి కుటుంబ, పాలనాపర సమస్యలు వచ్చినప్పుడు ఇతడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చాడు. కంచికామకోటి, శృంగేరి, పరకాల, పుష్పగిరి, మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను తన పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నారు.
==బహుముఖ ప్రతిభ==
ఇతడు బహుముఖీన ప్రతిభావంతుడు. కేవలం సంస్కృత రచనలేకాక ఆయుర్వేదంలో ఇతడు దిట్ట. ఇతని ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. ఎంతో మంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చాడు. అంతేగాక వడ్రంగి, కంసలి వంటి వృత్తులలో కూడా ఇతనికి ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణీ విలాస నిలయః అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందెల అలంకరణ ఇతడి ప్రతిభకు నిదర్శనాలు. ఇతడు 1959లో రాజాపురం గ్రామానికి మొదటి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై కిరోసిన్‌తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన గొప్ప ప్రజానాయకుడు.
==సాహిత్య రంగం==
1922- 23 సంత్సరం నుంచి ఇతని సాహిత్య ప్రస్థానం ప్రారంభమైనది. ఇతని మొదటి రచన 27 ఆర్యావృత్తాలతో కూడిన భారతీ తారామాల అనే శారదాస్తుతి. దీనిని ఇతడు బందరులో ఉన్నప్పుడే రచించాడు. మాణిక్యప్రభు పీఠాన్ని దర్శించి ఆశువుగా కవితా కాంతా స్వయంవరము అను ఖండకావ్యాన్ని చెప్పారుచెప్పాడు. ఇది 1926లో ముద్రించబడినది. ఇందలి కవిత్వం సిద్ధహస్తుని రచనా విశేషము వలెనే ఉన్నది అని కేశవపంతుల నరసింహశాస్త్రి దీనిని సమీక్షించారు.
 
శృంగేరీ పీఠానికి వెళ్లి అక్కడ శారదాదేవిని చూడగానే తెల్కపల్లివారుఇతడూ శారదా నవరత్నమాలికను ఆశువుగా చెప్పడమే కాకుండా లలితాస్తవఝరి అనే పేరుతో మరో 50 శ్లోకాలను చెప్పారుచెప్పాడు. మైసూరులోని పరకాల మఠాన్ని దర్శించి అక్కడి హయగ్రీవస్వామిపై హయగ్రీవ శతకాన్ని రచించి పండితుల మెప్పును పొందారుపొందాడు. తర్వాత కాలంలో శారదానవరత్నమాలికను పొడిగించి శారదాస్తుతి శతకాన్ని రచించారురచించాడు. ఇవేకాక ఉమామహేశ్వర సుప్రభాతం, శ్రీహనుమత్సుప్రభాతం, మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ సుప్రభాతం, గురుపీఠతత్త్వదర్శనం, శివానందాష్టకం, గణేశ పంచరత్నాలు, అయ్యప్పస్తుతి వంటి ముద్రిత రచనలతోపాటు కలిశతకం, రవీంద్రతపఃఫలము, ధూమశకట ప్రమాదం, చ్యవనోపాఖ్యానం, సుకన్యాస్తవం, మృత్యుశకటం వంటి అముద్రిత రచనలను చేశారుచేశాడు. వీరిఇతని కావ్యలక్ష్మి రచనను గోలకొండ కవుల సంచికలో చూడవచ్చు. సింగంపల్లె సిద్ధాంతి భూభ్రమణ భ్రాంతి నిరసనం ను రచించడం వెనుక తెల్కపల్లి శాస్త్రుల వారి రెండు సంవత్సరాల కృషి దాగి ఉందిచోటుచేసుకుంది.
 
తెల్కపల్లి రామచంద్రశాస్త్రి సంస్కృత కవిత లుకవితలు, సాహిత్యోపన్యాసాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. కామకోటి, ఆంధ్రభూమి, సనాతన మత ప్రచారిణి, సమాలోచన మొదలైన పత్రికలు వీరి రచనలను ప్రచురించాయి. వనపర్తికి చెందిన విక్రాల నరసింహాచార్యులతో కలిసి వీరుఇతడు జంట కవిత్వం చెప్పారుచెప్పాడు. ఆమనగల్లు మండలం సింగంపల్లెలో వీరు అష్టావధానం చేశారుచేశాడు. దేశాటనం పండిత మిత్రతాంచ అన్న ప్రకారం దేశంలోని ఎన్నో ప్రదేశాలను చూశారు. 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్కృ త సలహా సంఘం సభ్యులుగా నియమితులైనారు. 1977 నుంచి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979 సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా వీరిని సత్కరించింది. 1931వ సంవత్సరంలో వీరికి కవి కులతిలక, 1932లో బులుసు అప్పన్న శాస్త్రిచే అభినవ కాళిదాసు, సురవరం ప్రతాపరెడ్డిచే అలంకార నటరాజ మొదలగు బిరుదులు వీరిని వరించినవి. సాహిత్య కల్పద్రుమ అనెడి బిరుదు కూడా వీరికి కలదు.
==సన్మానాలు==
 
ఇతడు [[వనపర్తి]], [[ఆత్మకూరు]], [[కొల్లాపురం]] సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డాడు. కంచికామకోటి, శృంగేరి, పరకాల, పుష్పగిరి, మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను తన పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నాడు. 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్కృ త సలహా సంఘం సభ్యులుగా నియమితులైనాడు. 1977 నుంచి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979 సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా ఇతడిని సత్కరించింది.
దేశ అఖండత్వానికి ప్రతీకగా నిలిచి, అతిక్లిష్ట విషయాలను సైతం ఒక నిశ్చిత పద్ధతిలో అత్యల్పమైన మాటలతో ప్రసాదించే సంస్కృత భాషాసేవ తన జీవితమంతా చేసిన మహాపండితులు తెల్కపల్లె రామచంద్రశాస్త్రి 1990 ఏప్రిల్ 30న మరణించారు.
==బిరుదులు==
* కవి కులతిలక
* అభినవ కాళిదాసు
* అలంకార నటరాజ
* కల్పద్రుమ
==మరణం==
సంస్కృత భాషాసేవ తన జీవితమంతా చేసిన మహాపండితుడు తెల్కపల్లె రామచంద్రశాస్త్రి [[1990]], [[ఏప్రిల్ 30]]న మరణించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}