తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 10:
ఇతడు బహుముఖీన ప్రతిభావంతుడు. కేవలం సంస్కృత రచనలేకాక ఆయుర్వేదంలో ఇతడు దిట్ట. ఇతని ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. ఎంతో మంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చాడు. అంతేగాక వడ్రంగి, కంసలి వంటి వృత్తులలో కూడా ఇతనికి ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణీ విలాస నిలయః అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందెల అలంకరణ ఇతడి ప్రతిభకు నిదర్శనాలు. ఇతడు 1959లో రాజాపురం గ్రామానికి మొదటి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై కిరోసిన్తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన గొప్ప ప్రజానాయకుడు.
==సాహిత్య రంగం==
1922- 23
శృంగేరీ పీఠానికి వెళ్లి అక్కడ శారదాదేవిని చూడగానే ఇతడూ శారదా నవరత్నమాలికను ఆశువుగా చెప్పడమే కాకుండా లలితాస్తవఝరి అనే పేరుతో మరో 50 శ్లోకాలను చెప్పాడు. మైసూరులోని పరకాల మఠాన్ని దర్శించి అక్కడి హయగ్రీవస్వామిపై హయగ్రీవ శతకాన్ని రచించి పండితుల మెప్పును పొందాడు. తర్వాత కాలంలో శారదానవరత్నమాలికను పొడిగించి శారదాస్తుతి శతకాన్ని రచించాడు. ఇవేకాక ఉమామహేశ్వర సుప్రభాతం, శ్రీహనుమత్సుప్రభాతం, మామిళ్లపల్లి లక్ష్మీనరసింహ సుప్రభాతం, గురుపీఠతత్త్వదర్శనం, శివానందాష్టకం, గణేశ పంచరత్నాలు, అయ్యప్పస్తుతి వంటి ముద్రిత రచనలతోపాటు కలిశతకం, రవీంద్రతపఃఫలము, ధూమశకట ప్రమాదం, చ్యవనోపాఖ్యానం, సుకన్యాస్తవం, మృత్యుశకటం వంటి అముద్రిత రచనలను చేశాడు. ఇతని కావ్యలక్ష్మి రచనను గోలకొండ కవుల సంచికలో చోటుచేసుకుంది.
తెల్కపల్లి రామచంద్రశాస్త్రి సంస్కృత కవితలు, సాహిత్యోపన్యాసాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. కామకోటి, ఆంధ్రభూమి, సనాతన మత ప్రచారిణి, సమాలోచన మొదలైన పత్రికలు వీరి రచనలను ప్రచురించాయి. వనపర్తికి చెందిన విక్రాల నరసింహాచార్యులతో కలిసి ఇతడు జంట కవిత్వం చెప్పాడు. ఆమనగల్లు మండలం సింగంపల్లెలో అష్టావధానం చేశాడు.
==సన్మానాలు==
ఇతడు [[వనపర్తి]], [[ఆత్మకూరు]], [[కొల్లాపురం]] సంస్థానాలలో చాలాసార్లు సన్మానింపబడ్డాడు. కంచికామకోటి, శృంగేరి, పరకాల, పుష్పగిరి, మాణిక్యప్రభు పీఠాలలోని అధిపతులను తన పాండిత్యం, కవిత్వంతో మెప్పించి సత్కారాలు అందుకున్నాడు. 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్కృ త సలహా సంఘం సభ్యులుగా నియమితులైనాడు. 1977 నుంచి కళాకారుల గౌరవ వేతనాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1979 సంవత్సరపు ఉత్తమ సంస్కృత విద్వాంసునిగా ఇతడిని సత్కరించింది.
|