దిద్దుబాటు సారాంశం లేదు
Blanked the page
పంక్తి 1:
 
[[పెద్దాపుర సంస్థాన చరిత్రము]]
{{దస్త్రం:పెద్దాపుర సంస్థాన చరిత్రము - వత్సవాయ రాయజగపతి వర్మ ప్రచురితము |వంగలపూడి శివకృష్ణ చే ఇప్పటి వాడుక బాషలోకి అనువదించబడినది}}
 
[[పెద్దాపుర సంస్థాన చరిత్రము]]
వత్సవాయి రాయ జగపతి వర్మ గారు - పెద్దాపురం మహా సంస్థాన చరిత్ర మరుగున పడిపోవడం సహించలేక దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి ఎందరో పండితులు, మేధావులు, బహు బాషా కోవిదులు మరియు మరెందరో చరిత్రకారులు సహకారంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో కష్టపడి రచించిన ------ పెద్దాపుర సంస్థాన చరిత్రము --- ను ఇప్పటి వాడుక బాషలో అనువదించడానికి ప్రయత్నిస్తున్నాను దయచేసి సహకరించవలసినదిగా కోరి ప్రార్ధిస్తున్నాను ... ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ
 
[[పెద్దాపుర సంస్థాన చరిత్రము]]
ఆంధ్ర గీర్వాణ బాషా కోవిదుడు
బహు శాస్త్ర విశారదుడు
ఉభయ బాషా కవి
వైఘాన ధర్మ చంద్రికాది గ్రంధ కర్త
శ్రీ రామ భక్తుడు
అస్మత్ ఆధ్యాత్మిక గురువరేణ్యుడు అయినటువంటి మా తాతయ్య గారు శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి రాజు గారికి ---------------------- మరియు
స్త్రీ ధర్మ పరిపాలకురాలు
సాధ్వీ మణి అయిన మా చిన్నమ్మ (బాబయ్యమ్మ) శ్రీమతి బుచ్చియ్యంబా దేవి గారికి .................................. తల్లి లేని నాకు ఆ లోటు తెలియకుండా ఎంతో ప్రేమతో పెంచి విద్యా బుద్దులు నేర్పి నా ఎదుగుదలకు కారణమై - నన్ను ఇంత ఉన్నత స్థితి కి తీసుకు వచ్చినందుకు కృతజ్ఞతతో ఈ గ్రంధం ను మీకు సమర్పిస్తున్నాను.
 
 
[[పెద్దాపుర సంస్థాన చరిత్రము]]
పీఠిక
--:0:--
ఏదైనా ఒక పని చేయడం - విమర్శించడం (ఆక్షేపణ చేయడం) అంత సులువు కాదు బాషలో అక్షరాలు ఉన్నంత వరకూ నోరు ఉన్నంత వరకూ విమర్శలకు (హేళనకు) కొరత ఉండదు. పనిచేసే వారు తక్కువ - విమర్శించే (అధిక్షేపించెవారు) ఎక్కువ ఉండటం ప్రపంచ స్వబావం - లోకవిరుద్ధం కాదు ఆకారణం వల్లే పెద్దాపుర సంస్థాన చరిత్రము మొదటి ముద్రణ కొన్ని విమర్శలకు గురి అయ్యింది అంతమాత్రానికే నిరుత్సాహ పడిపోయే వాణ్ని కాదు నేను. చాలా మంది విద్యాధికులు (well educated people) నన్ను ప్రోత్సహించారు వారిలో ముఖ్యులు గుంటూరు డిప్యుటీ కలెక్టరు మరియు ఆంద్ర సాహిత్య పరిషత్ కార్య నిర్వాహక అధ్యక్షులు అయిన బ్రహ్మర్షి జయంతి రామయ్య పంతులు B.A B.L (బి.ఎ - బి.ఎల్), యల్ . టి గారు గోదావరి జిల్లా సంఘ కార్యదర్శి - మహారాజశ్రీ దుగ్గిరాల సూర్యప్రకాశరావు పంతులు బి ఎ గారు, విజయనగరం మహారాజావారి కళాశాల అధ్యక్షులు శ్రీమాన్ రావు బహద్దూర్ కిళాంబి రామానుజాచార్యులు యం ఎ బి ఎల్ ఎఫ్ యం యు గారు గవర్నర్ జనరల్ గారి శాసనసభా సభ్యులు శ్రీ రాజా పానుగంటి రామరాయనిం గారు యం ఎ ఇంకా మరి కొంతమంది ఇచ్చిన అమూల్యమైన అభిప్రాయాలకు సలహాలకు నేనెంతో కృతజ్నుడుని
 
మనదేశంలో చారిత్రిక విషయాలపట్ల జ్ఞానం ఇంకా మొదటి దశ (శైశవదశ) లోనే వుండటం వల్ల ఇలాంటి ప్రోత్సాహాలు-నిరుత్సాహ పరచడాలు ప్రతి చరిత్రకారుడికి ఉంటాయి. అంత మాత్రము చేత రచయిత (గ్రంధ కర్త) నిరుత్సాహ పడవలసిన అవసరంలేదు. ఇంకా రచయిత (గ్రంధ కర్త) యొక్క ప్రధమావస్థ (రచనలు చేసే ముందు అతని ఆలోచనా తీరు-పరిస్థితి) గురించి కొంచెం చెప్ప వలసి వుంది . పెద్దాపురం సంస్థానము యొక్క చరిత్ర నామ రూపములు లేకుండా జీర్ణించి పోతుందని నెలల తరబడి మద్రాస్ పట్టణం లో ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడే ఉండి నన్ను ఎంతమంది నిరుత్సాహ పరచినా, నాకు ఆంధ్రా- ఆంగ్లేయ బాషల పై అంత పట్టు లేకపోయినా పట్టుదలతో అతి కష్టం మీద మూడు సంవత్సరాలకు గ్రంధమును పూర్తిచేసాను. నన్ను ఆ విధంగా నిరుత్సాహ పరచడం వారికి ధర్మం కాదు. నిరుత్సాహ పరిచిన వారిని ఈ ఆంద్ర లోకం ఎప్పటికీ క్షమించదు.
 
నా గ్రంధములో లోపం లేదని నేను చెప్పడం లేదు. అనేక లోపాలు ఉండవచ్చు. నా అభివృద్ధి ని కోరే మహాత్ములిచ్చిన సరైన సలహాలను స్వీకరించి ఈ రెండవ ముద్రణ లో కొన్ని సవరణలు చేసాను. నాకు కొత్తగా దొరికిన మరికొన్ని ఆధారాలను అనుసరించి కొన్ని భాగాలు పెంచి రాసాను - ఈ రెండవ ముద్రణ లో ఏవైనా తప్పులు దోషములు ఉన్నా, ఇంకా రానున్న కాలంలో మరిన్ని ఆధారాలు దొరికినా దేశ అభిమానులైన నా ఆంధ్రా సోదరులు నాకు తెలియచేసి మూడవ ముద్రణలో సవరణలు జరిగేలా సహాయం చేస్తారని, సరైన ఆధారాలు లేని సవరణలు మరియు అసందర్భమైన విమర్శలకు జవాబు ఇవ్వడం జరగదని విన్నవించుకొంటున్నాను. ఈ గ్రంధ రచనలో నాకు సహాయం చేసిన అంగ్లేయాంధ్ర గ్రంధాలను- ఈ గ్రంధం లోని పుట (పేజీ) లలో తెలియచేసాను కానీ పేజీ నెంబర్ వేయుటకు నా దగ్గర ఆ గ్రంధాల యొక్క వ్రాతప్రతులు( ) గానీ ముద్ర ప్రతులు ( )గానీ లేవు పాఠశాలల్లో పిల్లలకు చదువుచెప్పడానికి ఉపయోగించే అనేక పుస్తకాలు చదివి వ్రాసిన బాగాలు , చరిత్ర జ్ఞానం అభిషిలషించే వారు తెలిపిన సుప్రసిద్ధ విషయాలు, ప్రాచీన పుస్తకాలలోని స్థానిక చరిత్రల యొక్క పేరాలు అన్నీ వ్రాతప్రతులే () కావడం వల్ల ఆ ప్రతుల నుండి సేకరించి వ్రాయబడ్డ గ్రంధముల పేజీలు  వాటి నెంబర్ లు వేయుటకు వీలు కాలేదు. చిత్రపటాలు ముద్రించడానికి వీలైన మంచి కాగితం లభించక పోవడం వల్ల ఈ ముద్రణలొ చిత్రపటాలు ముద్రించలేదు. వీలైనచో ఈ గ్రంధానికి అనుబంధముగా గానీ, మూడవ ముద్రణలోగానీ ఖచ్చితంగా ముద్రిస్తానని వినవించుకొంటున్నాను.
 
పూర్వం పెద్దాపురం సంస్థానం ఆంధ్ర దేశం లో ఒక బాగం గా వుండేది. దానిని సుమారు 300 సంవత్సరముల వరకూ శ్రీ వత్సవాయ వంశస్తులైన క్షత్రియులు పాలించారు. ఆ తరువాత సంస్థానంలోకి చిన్న చిన్న జమిందారులు, ముఠా లు మాత్రమే ఒకప్పుడు పెద్దాపురం అన్నంతగా మారిపోయింది. ఆ తరువాత పెద్దాపురం ఒక తాలుకా గ్రామంగా ఉండి బ్రిటీషు వారి అనేక కార్యాలయములతో నిండి పోయింది....పూర్వం ఈ పెద్దాపురం - పిఠాపురం ప్రాంతాలు " పొర్లు నాడు " అని పిలవ బడేవి - పెద్దాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు నది ప్రవహించడం వాళ్ళ దీనికి ఆ పేరు వచ్చిందని అనేవారు. 'ఈ ఏలేరు ఆధారము వలననే పల్లపు భూములలోని చాలా బాగం సాగు చేయబడుచున్నది. ఇక్కడ మెట్ట పంట విరివిగా పండును. గోదావరి జిల్లాలన్నిటిలో ఇతర తాలుకా గ్రామాలన్నిటినీ పోల్చి చూస్తే ఇక్కడ జన సంఖ్య తక్కువగా ఉన్నది. ఇక్కడ చదరపు మైలుకి (కిలోమీటరున్నర) కి సుమారు 331 మంది మాత్రమే కలరు. పల్లపు తాలూకాల కంటే విద్యా విషయం లో వెనుకబడి వుంది. పురుషులలో నూటికి 5 శాతం ప్రజలు మాత్రమే చదవడం, వ్రాయడం నేర్చుకొన్నారు. ఉ త్తర సర్కార్లు అని పిలువబడే ఆంధ్రదేశ బాగంలోని ఈ పెద్దాపురం సంస్థానమును పరిపాలించిన శ్రీ వత్సవాయ రాజ వంశీయులు సూర్యాన్వయ సంభవులనీ వీరికి మూల పురుషుడు సాగిపోతరాజు అని ఏనుగు లక్ష్మణ కవి వారు తన రామ విలాసం అనే గ్రంధములో
* మీ [[వంగలపూడి శివకృష్ణ]]