సీతారాం ఏచూరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వ్యక్తిగత జీవితం: {{commons category|Sitaram Yechury}}
పంక్తి 40:
== వ్యక్తిగత జీవితం ==
మద్రాస్‌లో స్థిరపడిన తెలుగు మాట్లాడే దంపతులు సర్వేశ్వర సోమయాజి ఏచూరి, కల్పకం ఏచూరి దంపతులకు [[1952]]లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దిల్లీలోనే సాగింది. దిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో బీఏ(ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జేఎన్‌యూలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఆయన అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో PH.Dలో చేరినా....పూర్తి చేయలేకపోయారు. సీతారాం ఏచూరి సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు.గతంలో ఆమె బీబీసీ హిందీకి దిల్లీ ఎడిటర్‌గా పనిచేశారు.ప్రస్తుతం ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రెసిడెంట్‌ ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం, కుమార్తె ఎడిన్‌బరోలో ఫ్రొఫెసర్, ఓ కుమారుడు జర్నలిస్ట్, మరో కుమారుడు ఇంకా చదువుతున్నారు.సీతారాం ఏచూరి ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌లో కాలమ్స్‌ రాస్తుంటారు. సీతారాం ఏచూరి గురించి ఎక్కువ మందికి తెలియని విషయమేమంటే... ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన [[మోహన్‌కందా]] మేనల్లుడు. సీతారాం అమ్మగారు.. మోహన్ కందా సోదరి. ఆయన మాతృమూర్తి కల్పకం గారు... [[దుర్గాభాయి దేశ్‌ముఖ్‌]] శిష్యురాలు.
 
{{commons category|Sitaram Yechury}}
 
[[వర్గం:భారత కమ్యూనిస్టు నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/సీతారాం_ఏచూరి" నుండి వెలికితీశారు