ఇద్దరు పెళ్లాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* మాటలు, పాటలు: కోపల్లె వెంకట రమణారావు
==కథ==
పిల్లలు లేని ఒక జమీందారు (సి.ఎస్.ఆర్)ను అతని భార్య రాధ (పి.వి.రాజమ్మ) పిల్లలకోసం రెండో పెళ్లి చేసుకోమని మాటవరుసకు అడుగుతుంది. ఆ మాటను సాకుగా తీసుకుని జమీందారు తాను ఇదివరకే వలచిన పుష్ప (లక్ష్మీకాంతం)ను పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం సవతులిద్దరూ బాగానే ఉంటారు. కానీ పుష్ప ముందుముందు తన గతేమవుతుందో అనే భయం వల్ల జమీందారుకు రాధపై చాడీలు చెప్పి జమీందారు మనసు విరుస్తుంది. కొంతకాలానికి రాధ గర్భవతియై మగశిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువు పుట్టగానే పుష్ప ఒక నౌకరుచేత ఆ శిశువును చెత్తకుప్పలో పడవేయించి శిశువు చనిపోయాడని అందరికీ చెబుతుంది. ఆ శిశువును పేదవాడొకడు చూచి తన ఇంటికి తీసుకువెళ్లి పెంచుకుంటూ ఉంటాడు. రాధకూ, ఆ పేదవాడికీ అక్రమ సంబంధం అంటగట్టి పుష్ప జమీందారుకు ఆగ్రహం తెప్పిస్తుంది. జమీందారు వళ్లు తెలియని కోపంతో రాధ గొంతు నులిమివేస్తాడు. ఆమె చనిపోయిందని అంతా అనుకుంటారు గానీ, ఆమె తేరుకుని అక్కడా అక్కడా కూలిపని చేసుకుని పొట్టపోసుకుంటూ ఉంటుంది. ఇలా చాలాకాలం గడిచిపోతుంది. జమీందారును తన చేతి కీలుబొమ్మగా చేసుకుని పుష్ప ఆడిస్తూ, చివరకు అతడిని ఇంట్లోనే బంధించి తను పెత్తనం చెలాయిస్తుంటుంది. మొదటి భార్యకు పుట్టిన కొడుకు మల్లయ్య (ఎన్.టి.ఆర్.) అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు. అతడు కన్నమ్మ (జమున) అనే పేదపిల్లను ప్రేమిస్తాడు. చివరకు జమీందారు రెండవ భార్య చేసిన ద్రోహం, మొదటి భార్య నిర్దోషిత్వం తెలుసుకుని పశ్చాత్తాపపడతాడు. పుష్ప విషం త్రాగి ఆత్మహత్య చేసుకుంటుంది. జమీందారు తన మొదటి భార్య రాధను, కొడుకు మల్లయ్యను కలిసి క్షమాపణ కోరతాడు. మల్లయ్య కన్నమ్మను వివాహం చేసుకుంటాడు. అంతా సుఖంగా ఉంటారు.
పిల్లలు లేని ఒక జమీందారు (సి.ఎస్.ఆర్)ను అతని భార్య రాధ (పి.వి.రాజమ్మ) పిల్లలకోసం రెండో పెళ్లి చేసుకోమని మాటవరుసకు అడుగుతుంది. ఆ మాటను సాకుగా తీసుకుని జమీందారు తాను ఇదివరకే వలచిన పుష్ప (లక్ష్మీకాంతం)ను పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం సవతులిద్దరూ బాగానే ఉంటారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఇద్దరు_పెళ్లాలు" నుండి వెలికితీశారు