నేదునూరి గంగాధరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నేదునూరి గంగాధరం''' ([[జూలై 4]], [[1904]] - [[మార్చి 11]], [[1970]]) జానపద సాహిత్యాన్ని ఉద్యమంగా నడిపిన ప్రముఖులు.
 
== జననం ==
వీరు 4 [[జూలై 4]], [[1904]] సంవత్సరంలో [[రాజమండ్రి]]లో జన్మించారు. చదివిన కొద్దిపాటి చదువుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. చిన్ననాటి నుండి జానపద వాజ్మయ సేకరణ ఒక మహత్కార్యంగా భావించారు. దానిని ఎంతో ప్రయాసకోర్చి గ్రామగ్రామాలు తిరిగి జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, పండుగ పాటలు, ఆటపాటలు, ప్రార్థన గేయాలు, వినోద గేయాలు, ఎక్కిరింత పాటలు, జంటపదాలు, [[జాతీయాలు]], [[సామెత]]లు, కిటుకు మాటలు - లక్షల సంఖ్యలో సేకరించారు. వీనిలో కొన్ని 1953లో సంభవించిన గోదావరి వరదలలో కొట్టుకొనిపోయాయి. మిగిలినవాటినుండి మొదటగా సెలయేరు - జానపద గేయ సంకలనాన్ని 1955లొ దేశోద్ధారక గ్రంథమాల వారు ప్రచురించారు. తర్వాత వ్యవసాయ సామెతలను 1956లో ప్రచురించారు. సుమారు 5,000 తెలుగు సామెతలు, జాతీయలు కలిగిన వీరి "పసిడి పలుకులు" గ్రంథం ఒక అపూర్వమైన సంకలనం. ఆ తర్వాత మేలుకొలుపు పాటలు, మంగళ హారతులు, మిన్నేరు, మున్నీరు, స్త్రీల వ్రత కథలు, జానపద గేయ వాజ్మయ వ్యాసావళి మొదలైన గ్రంథాలు ప్రచురించారు.
 
== మరణం ==
వీరు 11[[1970]], [[మార్చి, 197011]]వ తేదీన పరమపదించారు.
 
==ఇతర రచనలు==
Line 12 ⟶ 14:
{{మూలాలజాబితా}}
* గంగాధరం, నేదునూరి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 130.
 
==ఇతర లింకులు==
* [http://sobhanaachala.blogspot.in/2014/12/blog-post_26.html నేదునూరి గంగాధరం గారి జానపద సాహిత్యం]
"https://te.wikipedia.org/wiki/నేదునూరి_గంగాధరం" నుండి వెలికితీశారు