ఆంధ్ర నాయక శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:AndhraNayakaSatakamu.jpg|right|thumb|200px]]
'''ఆంధ్ర నాయక శతకము''' ఆంధ్ర శతకాలలో అనర్ఘరత్నం. [[కాసుల పురుషోత్తమ కవి]] శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు మీద నిందాస్తుతిగా ఈ [[శతకం]] రచించారు. తెలుగు భాషలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఈలాంటి వ్యాజస్తుతి శతకాలు అరుదు. నిందలో స్తుతిని, స్తుతిలో నిందను నిబంధించి భక్తితత్త్వాన్ని ప్రబోధించిన శతకరాజమిది. కాసులకవి నవ్యమైన భవ్యమైన వినుత్న పదాలతో ఎన్నెన్నో భావతరంగఅలనుభావతరంగాలను వెలార్చే 108 సీస పద్యాలతో ఈ శతకాన్ని ఆంధ్రులకు ఉపాయనంగా అందించి ధన్యుడయ్యాడు.
 
== శతక కర్త ==
[[దస్త్రం:Kasulapurushottam.jpg|right|thumb|150px|పెదప్రోలు లోని కాసుల పురుషోత్తమకవి శిల్పం]]
కాసుల పురుషోత్తమ కవి అసలు పేరు [[పల్లంరాజు]]. ఈయన [[కృష్ణా జిల్లా]] లోని [[పెదప్రోలు (చల్లపల్లి)|పెదప్రోలు]] గ్రామ నివాసి. సుమారు క్రీ.శ.1800 ప్రాంతానికి చెందినవాడు. ఈయన తల్లిదండ్రులు - రమణమాంబ మరియు అప్పలరాజులు. [[అద్దంకి తిరుమలాచార్యులు]] వీరి గురువులు. వీరు [[భట్టుమూర్తి]]గా ప్రసిద్ధుడైన అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడి వర్ణమైన భట్టరాజ కులంలో జన్మించారు. [[దేవరకొండ]] సంస్థానాధీశుడైన రాజా అంకినీడు బహద్దూర్ గారి ఆస్థానకవిగా ప్రసిద్ధుడు.
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_నాయక_శతకము" నుండి వెలికితీశారు