'''ఆచార్య వినోబా భావే'''గా ప్రసిద్ధి చెందిన '''వినాయక్ నరహరి భావే''' ([[సెప్టెంబర్ 11]], [[1895]] - [[నవంబర్ 15]], [[1982]]) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, [[మహాత్మా గాంధీ]] యొక్క ఆధ్యాత్మిక వారసుడు.
== జననం ==
వినోబా, [[మహారాష్ట్ర]]లోని [[గగోదే]]లో [[1895]], [[సెప్టెంబర్ 11]]న ఒక సాంప్రదాయ [[చిత్పవన్]] బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాల్యములో ఈయన [[భగవద్గీత]] చదివి స్ఫూర్తి పొందాడు.
ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన [[మరాఠీ]]లో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత ''టాక్స్ ఆన్ ది గీత'' అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.