పసునూరు శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: హైస్కూల్ → ఉన్నత పాఠశాల using AWB
పంక్తి 40:
 
==వృత్తి జీవితం==
న్యాయశాస్త్ర పట్టభద్రుడైన తరువాత [[1992]] లో కొన్ని రోజుల పాటు [[హై కోర్టు]] లో ప్రాక్టీసు చేసినా, అందులో తాను ఇమడలేనని భావించి తన ప్రవృత్తినే వృత్తిగా మార్చుకునేందుకు 1993 లో [[హైదరాబాద్]] లోని [[ఆంధ్రభూమి]] దినపత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. రెండేళ్ళు ఆంధ్రభూమి లో పని చేసిన తరువాత ఇండియా టుడే తెలుగు పత్రికలో సబ్ ఎడిటర్ గా ఎంపికయ్యారు. 1995 ప్రారంభం నుంచి 2008 నవంబర్ వరకు పద్నాలుగేళ్ళు [[ఇండియా టుడే]]కు ఎన్నో విశిష్ట కథనాలు అందించి, కవిగానే కాకుండా పాత్రికేయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2008 నవంబర్ చివరి వారంలో ఆ ఏడాది కొత్తగా ప్రారంభమైన 24 గంటల వార్తా చానల్ [[హెచ్ ఎమ్ టివి|హెచ్.ఎం.టి.వి]]లో అసిస్టెంట్ ఎడిటర్ గా చేరారు. ఆ తరువాత 2011 ఆగస్ట్ నెలలో V6 న్యూస్ ఛానెల్ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసి, చానల్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. 2012 సెప్టెంబర్ లో V6 న్యూస్ నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ హెచ్.ఎం.టి.విలో చేరారు. హెచ్.ఎం.టి.విలో ప్రోగ్రెస్ డిబేట్ వంటి స్ఫూర్తిదాయక చర్చలను నిర్వహించారు. 2013 డిసెంబర్ తో హెచ్.ఎం.టి.వి అనుబంధంనుంచి తెగిపోయిందివైదొలగారు. ప్రస్తుతంఆ తరువాత దాదాపు ఏడాది పాటు ETV తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ చానల్ల్లో ప్రైమ్ టైమ్ షో "ప్రతిధ్వని" కార్యక్రమాన్ని, ఇతర లైవ్ షోస్ ను ప్రజెంట్ చేస్తున్నారుచేశారు. అదే సమయంలో హైదరాబాద్ లోని పుడమి పబ్లికేషన్స్ నుంచి విద్యార్థులు, యువతరానికి రాజకీయ, సామాజిక, శాస్త్రీయ అంశాల మీద సులువుగా అవగాహన కల్పించే లక్ష్యంతో "Young Zone" అనే మాసపత్రికను ప్రారంభించారు. యంగ్ జోన్ మాస పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ గా పని చేసిన తరువాత, 2015 మే నెలలో మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగుపెట్టారు. ప్రజల చానల్ గా గుర్తింపు తెచ్చుకున్న 10టీవీకి అసోసియేట్ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించి, ప్రస్తుతం ఆ విధుల్లోనే కొనసాగుతున్నారు.
 
==అనేకవచనం==
పసునూరు శ్రీధర్ బాబు రచించిన కవితల సంకలనం "అనేకవచనం" 2001లో విడుదలైంది. ఆధునిక వచన కవిత్వంలో కొత్త గాలిలా వీచిన ఈ కవితా సంకలనానికి ప్రముఖ కవి [[ఇస్మాయిల్]] పూర్వవచనం పేరుతో ముందుమాట రాశారు. మరో ప్రముఖ కవి సిద్ధార్థ చివరిమాట రాశారు. ఈ సంకలనానికి ఆ ఏడాది వచ్చిన ఉత్తమ కవితాసంకలనంగా అజంతా అవార్డు, రమణ-సుమనశ్రీ ఫౌండేషన్, సిరిసిల్ల సాహితీ మిత్రుల పురస్కారాలు లభించాయి. అనేకవచనం అనే పదబంధం ఆధునిక కవిత్వానికి ఒక ప్రతీకగా స్థిరపడిపోయింది.