బేతవోలు రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1948 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
==జీవిత విశేషాలు==
===బాల్యం విద్యాభ్యాసం===
ఇతడు [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[నల్లజర్ల]] గ్రామంలో ఒక అతి సామాన్య కుటుంబంలో [[1948]], [[జూన్ 10]] న జన్మించాడు<ref>[http://sarasabharati-vuyyuru.com/2013/06/28/%E0%B0%B8%E0%B0%A6%E0%B1%8D%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%81-%E0%B0%AC%E0%B1%87%E0%B0%A4%E0%B0%B5%E0%B1%8B%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F/ సద్గురువు బేతవోలు -డాక్టర్ చాగం కొండారెడ్డి]</ref>. కష్టాలే తోడుగా ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుంచి ఎం.ఏ తెలుగు చదివాడు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య [[తూమాటి దొణప్ప]] పర్యవేక్షణలో ''తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం'' అనే అంశంపై పి.హెచ్.డి చేశాడు.
 
===ఉద్యోగం===
మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరాడు. ఇతని బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన [[ఏలూరిపాటి అనంతరామయ్య]] , మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, [[జమ్మలమడక మాధవరామశర్మ]] వంటి పండితులను కూడా ఆకర్షించేది. తరువాత ఇతడు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఒకరోజు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ఇతడి పద్యాలు విని అభినందిస్తూ… ‘మేం త్వరలో ఏర్పాటు చేయబోయే తెలుగు విశ్వవిద్యాలయానికి మీ వంటి వారు అవసరం. త్వరలో మనం తప్పకుండా కలుద్దాం’ అని అన్నాడు. దాంతో రామారావు ప్రత్యేకంగా కళలకు సంబంధించి తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించడం, రాజమండ్రి వద్దనున్న బొమ్మూరు కేంద్రంగా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయడం, అక్కడికి ఇతడిని ఆచార్యులుగా తీసుకోవడం జరిగింది. అక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పనలోనూ, పరిశోధన విషయంలోనూ ఇతడు పెనుమూర్పులు తీసుకువచ్చి భావితరాలకు మార్గదర్శకత్వం వహించడంలో కీలకపాత్ర పోషించాడు. ‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు ఇతడు సూచించిందే. హైదరాబాద్‌లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచాడు. ఇతడి మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు.
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_రామబ్రహ్మం" నుండి వెలికితీశారు