ధూమరేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
మరొకప్రక్కన అక్కడ వేదమరీచి రాజ్యంలో అజాతశత్రుడు మాళవ రాజకుమారుడు. సుక్షత్రియ వంశీయుడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోగా జ్ఞాతులు సంపదలు చేజిక్కించుకుని, వెళ్ళగొట్టగా అతను మగధకు వచ్చి అక్కడ రాజోద్యోగిగా వుంటాడు. రాజుకీ, మంత్రికీ అత్యంత సన్నిహితుడు. వేదమరీచితో అతని వివాహం జరిపించి అతనినే మగధకు రాజును చేస్తారేమోననేంత సాన్నిహిత్యం. అయితే కాశీ నుంచి తిరిగి వచ్చిన వేదమరీచి ఆ ముగ్గురితోను తన రహస్యం చెప్పేస్తుంది. ముగ్గురూ నిశ్చేష్టులవుతారు. రాజు వేదమరీచితో పాటు తానూ దుఃఖించి ఆమె వివాహానికి సుముఖంగా లేదన్న విషయం మాత్రం ప్రజలకు తెలియచేసి ఊరుకుంటాడు. అయితే శిశునాగుడి వివాహం జరిగాక కొన్నాళ్ళకి వృద్ధమంత్రి, రాజు మరణిస్తారు. ఆ తర్వాత కొంత ఆలోచించి వేదమరీచి, అజాతశత్రువు వివాహం చేసుకుంటారు. అప్పటికి వంకజాబిల్లికీ శిశునాగుడికీ పుట్టిన కొడుకు కాకవర్ణుడు ఆరేళ్ళ వాడు.
 
వేదమరీచి వివాహ వార్త విని రగిలిపోతున్న శిశునాగుడితో వంకజాబిల్లి మీ పగ నేను సాధించిపెడతానంటుంది. అన్నంత పనీ చేస్తుంది కూడా. మగధతో యుద్ధం చేస్తే గెలవలేని చిన్న రాజ్యమైన కాశీరాజ్యపు రాజు శిశునాగుడు మగధకు రాజయ్యేలా చేస్తుంది. చుట్టరికం ఆధారంగా శిశునాగుడు, చంద్రమతీ దేవి, వంకజాబిల్లి మగధలో అడుగుపెడతారు. అలా అడుగుపెట్టడానికి కావలసిన పరిస్థితులు కల్పించ బడతాయి. అందుకు పరాశర శాస్త్రి కొంత ఉపయోగపడితే, కాశీరాజుని ఆవహించిన జయద్రథుడు – అతనికి కావల్సిందీ అదే కనుక – మరికొంత ఉపయోగపడతాడు. వేదమరీచిని హత్య చేసి, ఆ నేరం అజాతశత్రువుపై మోపి అతన్నీ హత్య చేసి, మగధ ప్రజల దృష్టిలో అతన్ని నేరస్తుడిని చేసి, శిశునాగుడు మగధకి రాజవుతాడు. అదీ నవలకి ముగింపు. అయితే ధర్మానికి, దేశానికి ఏమయిందనీ, జయద్రథుడి పగ సాగిందా? అన్న ప్రశ్నలు తర్వాతి నవలకు మిగిలిపోతాయి.<ref name="పుస్తకం.నెట్లో ధూమరేఖ గురించి">{{cite web|last1=టి.|first1=శ్రీవల్లీ రాధిక|title=ధూమరేఖ - కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ|url=http://pustakam.net/?p=16544|website=పుస్తకం.నెట్|publisher=సౌమ్య, పూర్ణిమ|accessdate=30 March 2016|language=తెలుగు}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ధూమరేఖ" నుండి వెలికితీశారు