ధూమరేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
'''ధూమరేఖ''' [[పురాణవైర గ్రంథమాల]] నవలల సీరీస్లో మూడవది. భారతీయుల పురాణాల్లోని చరిత్రాంశాలు వాస్తవమైనవంటూ, వాటిని మన చరిత్ర రచనకు ప్రామాణికంగా గ్రహించకపోవడం వల్ల ఎన్నో అంశాలు తెలియకుండా పోయాయన్నది ఈ నవలామంజరిలో విశ్వనాథ సత్యనారాయణ వాదం. నవలలోని కథాంశాలకు క్రమంగా కలియుగం ముగిశాకా పురాణాల ప్రకారం ఏర్పడ్డ రాజవంశాలను గుదిగుచ్చుతూ నేపథ్యం ఏర్పరుచుకున్నారు. ఇతివృత్తాల్లో కూడా భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని నాశనం చేద్దామని భావించిన మ్లేచ్ఛులు ఒక్కో నవల్లోనూ ప్రయత్నిస్తూండం కథా సూత్రంగా కొనసాగుతుంది.
== కథ ==
మగధ వంశం ప్రద్యోత వంశం చేతిలో ఉన్నప్పటి నేపథ్యం పురాణ వైర గ్రంథమాలలోని రెండవ నవలలో వస్తుంది. మూడవ నవలైన ధూమరేఖలో శిశునాగ వంశం వారుచేతిలోకి రాజ్యం చేస్తున్నప్పటివెళ్తున్న నేపథ్యంసంధికాలంలోది. శిశునాగుడు కాశీరాజు కుమారుడు. ప్రద్యోత వంశములోని అయిదవరాజైన నందివర్ధనుడు, శిశునాగుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. నందివర్ధనునకు పురుష సంతానం లేదు.వేదమరీచి ఒక్కతే కూతురు. ఆమె పేరు వేదమరీచి. ఆమె పుట్టినపుడే ఆమె తల్లి చనిపోయింది. కాశీరాజు ఆమెని తల్లి దుఃఖమునులేని మరచిపోవడానికిలోటు కాశీరాజులేకుండా ఆమెనిపెంచేందుకు కాశీ నగరానికి తీసుకెళ్ళాడు. అప్పటికి శిశునాగుడు కొంత చిన్నవాడు. శిశునాగుడు, వేదమరీచి కలిసి ఆడుకునేవారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది, మొదట అది పినతండ్రి, కూతుళ్ళ బంధం గానే వున్నా తర్వాత పక్కదోవ పడుతుంది.
 
భారతదేశాన్ని మ్లేచ్ఛమయం చేద్దామన్న ప్రయత్నాలు చేస్తున్న జయద్రథులనే పరంపరలోని ఒక జయద్రథుడు (మొదటి నవల భగవంతుని మీది పగలో ఈ విషయం చెప్తారు) తన శరీరాన్ని దగ్ధం చేసుకోగా (రెండవ నవల నాస్తిక ధూమము ముగింపులో చెప్పబడిన విషయం) వ్యాపించిన ధూమరేఖల నుండి కలి కూడా వ్యాపించింది. పుట్టుకతోనే శిశునాగునిలో అధర్మమైన సంస్కారం వుంది. వేదమరీచి పందొనిమిదేళ్ళు వచ్చేవరకు కాశీనగరం లోనే వుండి, అప్పుడప్పుడు గిరివ్రజపురానికి వచ్చి పోతూంటుంది. భార్యని అమితంగా ప్రేమించిన నందివర్ధనుడు మళ్ళీ వివాహం చేసుకోకపోవడంతో వేదమరీచి తమ మహారాణి అనీ, ఆమె మగధకు వచ్చి రాజ్యపాలన చేపట్టాలనీ మగధ ప్రజలు ఆశిస్తుంటారు. దీంతో మగధ రాజ్య మంత్రులలో వృద్ధులైన ఇద్దరు బతిమాలి, బలవంతము చేసి వేదమరీచిని ఒప్పిస్తారు.
 
శిశునాగునికి నేపథ్యంలోవేదమరీచి మగధరాజ్యం రాజ్యచేపట్టేందుకు మంత్రులలోవెళ్ళడం వృద్ధులైనఇష్టం ఇద్దరు బతిమాలిఉండదు, బలవంతము చేసి వేదమరీచిని ఒప్పిస్తారు. వేదమరీచికి కూడా తన రాజ్యం తాను పాలించాలని ఉన్నా, అది శిశునాగుడికి యిష్టం లేదు. అయినా వెళ్ళిపోతుంది. వేదమరీచిఆమె వెళ్ళిపోయాక శిశునాగుడు బాధతో, కోపంతో ఆ రాత్రి కాలినడకన ఎటు వెళ్తున్నాడో గమనించుకోకుండా చాలా దూరం నడుస్తూ వెళ్తాడు. అక్కడ ఒక కర్ర లోనుంచి వస్తూన్న పొగని గొట్టంతో పీలుస్తూన్న పిశాచంలాంటి మనిషిని చూస్తాడు. శిశునాగుడు ఆ వ్యక్తి పట్ల ఆకర్షితుడై ‘నేను నీదగ్గరే వుండి పోతాను’ అంటాడు. అతను ‘వద్దు, నువ్వు కోటకి వెళ్ళు. నేనే నిన్ను చూడటానికి కోటకి వస్తాను. నువ్వు వుండమంటే అక్కడే వుండిపోతాను.’ అంటూ శిశునాగుడి చేత ‘నేను నీ శిష్యుడిని’ అనిపిస్తాడు. తన చేతిలో వున్న కట్టెని శిశునాగుడికి యిచ్చి అతని చేత కూడా ధూమపానం చేయిస్తాడు. ఆ ధూమపానం చేయగానే శిశునాగుడిలో మార్పు వస్తుంది. వేదమరీచితో తనకున్న సంబంధం సహజమైనదేనని, తప్పుకాదని అనిపిస్తుంది.
 
తల్లి చంద్రమతీ దేవి తెల్లవారాకా వచ్చిన శిశునాగునిలో మార్పుని గుర్తిస్తుంది. శిశునాగుడిని వెదకుతూ వెళ్ళి తీసుకువచ్చిన పరిచారకుల్లో ఒకడైన చిత్రశిఖండిని, శిశునాగుడు ఎక్కడికి వెళ్ళిందీ ఆరాతీస్తుంది. మహానగరానికి దూరంగా ఉన్న శ్మశానాల మధ్య ప్రదేశమని, అక్కడ యువరాజువి కాక, మరో మనిషివీ, ఏదో భయంకరమైన నక్కవీ కూడా కాలి గుర్తులు ఉన్నాయని చెప్తాడు. వృద్ధరాజు, అంటే శిశునాగుడి తండ్రి ఆరోజునుంచీ మంచాన పడతాడు. చంద్రమతీదేవి తండ్రితో మాట్లాడమని ఒత్తిడి చేయగా శిశునాగుడు ఆయన దగ్గరగా వెళ్ళి మొహంలో మొహం పెట్టి మాట్లాడతాడు. అపుడు రాజు మొహంలోకి కొత్త ప్రకాశం వస్తుంది. శిశునాగుడి మాటలని ఆయన ముక్కుతో పీలుస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చినట్లుగా కనిపిస్తాడు “యువరాజా, నా పని అయిపోయింది. నీ రాజ్యం నువ్వు స్వీకరించు. నీ శత్రువులని దండించు. ప్రతీకారం తీర్చుకో.” అంటాడు.
"https://te.wikipedia.org/wiki/ధూమరేఖ" నుండి వెలికితీశారు