దేశముదురు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
;ఇది పక్కా మాస్ ప్రేమకధ.
 
ఒక టి.వి చానల్లో పనిచేసే బాలగోవింద్ {అల్లు అర్జున్} దూల్ పేటలో గుడుంబా కాయటం షూట్ చేసేందుకు తన టీం వాళ్ళతో కలసివెళతాడు. అక్కడ ఒకతన్ని గూండాలు హత్య చేయబోతే వాళ్ళను ఎదుర్కొని అతడిని కాపాడుతాడు. ఆగొడవలో అక్కడ పెద్ద గూండా అయిన తంబిదురై {ప్రదీప్ రావత్} కొడుకు మురుగేశన్ {సుబ్బరాజు}ను బలంగా కోమాలోకి వెళ్ళేలా కొడతాడు. అది తెలుసుకొన్న బాలగోవింద్ తండ్రి {చంద్రమోహన్} అతడిని ట్రావెల్ ఇండియా అనే ఎపిసోడ్ కోసం కులూమనాలి పంపిస్తాడు. అక్కడ వైశాలి {హంశికా మోత్వాని} అనే సన్యాసిని ప్రేమలోపడతాడు బాలగోవింద్. అతి కష్టంగా ఆమె ప్రేమను పొందుతాడు. అక్కడ ఆమెను హైదరాబద్ గూండాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోవడంతో ఆమెకోసం తిరిగి హైదరాబాద్ వస్తాడు. ఆమెను వెతుకుతూ దూల్ పేటకు వెళ్ళిన బాలగోవిందును చిన్న ప్రమాదం నుండి ఒకప్పుడు తను రక్షించిన అతడు కనిపించి రక్షిస్తాడు. అతడు ఇలా చెప్తాడు- వైశాలి వాళ్ళ నాన్న దగ్గర తను పనిచేస్తుండేవాడిననీ వైశాలి నాన్నను తంబిదురై హత్యచేసి వాళ్ళ ఆస్తిని తన చేతిలోకి తీసుకొన్నాడనీ అయితే ఆస్తి మొత్తం వైశాలి పేరున ఉండటంతో ఆమెను తన కొడుకు మురుగేశంకు ఇచ్చి పెళ్ళిచేసి ఆస్తి రాయించుకొన్నాక చంపే ప్రయత్నాలలో ఉన్నాడనీ చెపుతాడు. అక్కడినుండి బాలగోపాల్ తన టీం వాళ్ళతో కలిసి తంబిదురై అంతుచూసి వైశాలిని పెళ్ళాడటంతో కధ ముగుస్తుంది.
 
==చిత్ర విషేషాలు==
"https://te.wikipedia.org/wiki/దేశముదురు" నుండి వెలికితీశారు