ట్రస్టు పక్షాన సర్వోత్తమ భవనం, పైన బాపూజీ మందిరంతోపాటు, కార్యకర్తల నివాసానికి జోగిరాజు భవనం, రామినేని అచ్యుతరావు సదనాలను నిర్మించారు.
* సర్వోత్తమ భవనం :
సంఘం స్థాపించి ఎంతో కాలమైనా, [[1938]] వ సం||సంవత్సరం నాటికి దీనికి స్వంత భవనంగాని, స్థలంగాని లేవు. పటమటలంక వాస్తవ్యలు శ్రీ కొమ్మా సీతారామయ్యగారు ఈ లోటును పూరించారు.[[1939]] లో సంఘం క్రింద ఒక ఎకరం సలం ఖరీదు చేశారు. అలాగే గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారి షష్ఠిపూర్తి ... ముందుగా తామే నిర్వహించి వారికి కానుకగా నగదు సమర్పించి, మరికొన్ని తావులలో కూడా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసి ఆ రకంగా లభ్యమయిన మొత్తాన్ని భవన నిర్మాణానికి వినియోగించారు. ఇంకా దాతల నుండి విరాళాలను సేకరించి, చేతి సొమ్ము కొంత ుంచి రూ, 25 వేలతో సర్వోత్తమ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి ఎర్పాటు చేశారు. - 11