నండూరి రామకృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
==వ్యక్తిత్వం==
స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక సంచలనాన్ని సృష్టించింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ అది ఒక అపురూపమైన సృజనగా నీరాజనాలందుకొంటూనే ఉంది. వీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా (1987- 1990) పని చేసారు. వీరి రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. ’కవిత్రయం’ గ్రంథానికి ’తెలుగు భాషా సమితి’ పురస్కారాన్ని ఆనాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకొన్నారు. ' Gandhian Era ' గ్రంథానికి నాటి రాష్ట్రపతి డా. శంకరదయాళ్ శర్మ ’ముందు మాట’ ను వ్రాసారు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు. ’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో వీరితోబాటు ’జాషువ’, ’కరుణశ్రీ’ లను ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది. ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు.
నండూరివారు [[భీమవరం]] కాలెజీలో తెలుగు డిపార్టుమెంటు హెడ్ గా వుండేవారు. అక్కడ చదివినవారు ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగిన వారె. మైసూరు యూనివర్సిటి ప్రొపెసర్ [[తంగిరాల సుబ్బారావు]], ఆంధ్ర యూనివర్సిటి, [[కొర్లపాటి శ్రీరామమూర్తి]]., [[ఉషశ్రీ]], మొదలగు వీళ్లంతా నా శిష్యులు. లోకానికి వెలుగు నింపిన కాగడాలు. ఈ కాగడాలని వెలిగించిన కొవ్వొత్తిని నేను. అదే నా సంతృప్తి, గర్వమూనూ అనే వారు నండూరి వారు.