1984 సిక్ఖు వ్యతిరేక అల్లర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
[[1984]] సంవత్సరం నాటికి ఉగ్రవాదులను హడలెత్తించిన సీనియర్ సిక్ఖు పోలీసు అధికారి, సంపాదకుడు జగత్ నారాయణ్ కుమారుడు, ఆయన తర్వాతి సంపాదకుడు రమేశ్ చందర్ హత్యకు గురయ్యారు. [[భారత్ పాక్ యుద్ధం 1971|1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో]] బంగ్లాదేశ్ ముక్తిబాహినికి శిక్షణనిచ్చిన మాజీ మేజర్ జనరల్ షూబేగ్ సింగ్ భింద్రన్ వాలే పక్షాన చేరి స్వర్ణదేవాలయాన్ని యుద్ధానికి సిద్ధమైన కోటగా మలచనారంభించారు. అకాలీలతో పరిష్కారానికి వచ్చేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు, స్వర్ణ దేవాలయంలోని రక్షణ ఏర్పాట్లు తొలగించుకుని వెళ్ళిపొమ్మని భింద్రన్ వాలేకు నచ్చచెప్పడంలో అకాలీల ప్రయత్నాలు విఫలమయ్యాయి. భింద్రన్ వాలే పక్షం మరింత యుద్ధ సుముఖులయ్యారు. మరోవైపు సంత్ లోంగోవాల్ భారతదేశపు ధాన్యాగారమని పిలిచే పంజాబ్ నుంచి ధాన్యం గింజ కూడా బయటకు వెళ్ళకుండా తానొక ఉద్యమాన్ని ప్రారంభిస్తానంటూ ప్రకటన చేశారు.
=== ఆపరేషన్ బ్లూస్టార్ ===
''ప్రధాన వ్యాసం: [[ఆపరేషన్ బ్లూస్టార్]]''<br />
పంజాబ్ గ్రామీణ ప్రాంతంలో హింస చెలరేగే అవకాశాలు, ఇతర ప్రమాదకర పరిణామాలను అనుమానిస్తూనే ప్రధానమంత్రి ఇందిరా గాంధీ [[ఆపరేషన్ బ్లూస్టార్|స్వర్ణ దేవాలయాన్ని ఉగ్రవాదుల నుంచి విడిపించే ఆపరేషన్]] కు ఆదేశమిచ్చారు. సిక్ఖు మతస్తుడు, జనరల్ షూబేగ్ నుంచి కెరీర్ ప్రారంభంలో శిక్షణ పొంది, బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో సహచరునిగా పనిచేసిన జనరల్ బ్రార్ ను దీనికై నియమించారు. జూన్ 5వ తారీఖున ప్రారంభమైన దాడి భారత సైన్యం అంచనాలను కొంతవరకూ తలకిందులు చేస్తూ దీర్ఘంగా సాగింది. తప్పనిసరి పరిస్థితుల్లో బ్రార్ కేంద్రాన్ని అనుమతి కోరి ట్యాంకులను వినియోగించారు. దీంతో జూన్ 6వ తేదీన 5-13 ట్యాంకులు ఆలయద్వారాలను, రక్షణ ఏర్పాట్లను విరగగొట్టి స్థానాలను గ్రహించి అకాలీ తఖ్త్ పై కాల్పులు సాగిస్తూనే వచ్చారు. అప్పటికల్లా భింద్రన్ వాలే, అమ్రిక్ సింగ్, షూబేగ్ సింగ్ వంటి ప్రముఖులు సహా, యుద్ధంలో పాల్గొన్నవారంతా మరణించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం సైన్యం పక్షాన 79మంది, ఉగ్రవాదుల వైపున 492 మంది మరణించారు. ఐతే ఇతరుల కథనాల ప్రకారం సైనికులు 500 కన్నా ఎక్కువ సంఖ్యలోనూ, ఇతరులు 3వేల మంది, వీరిలో అధిక సంఖ్యాకులు సైనికచర్యలో చిక్కుకుపోయిన సాధారణ భక్తులు, చనిపోయారు.
=== ఇందిరా గాంధీ హత్య ===
''ప్రధాన వ్యాసం: [[ఇందిరా గాంధీ హత్య]]''<br />
ఆపరేషన్ బ్లూస్టార్ ముగిశాకా అప్పటివరకూ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల వ్యతిరేకతతోనూ, ప్రభుత్వానికి అనుకూలురుగానూ ఉన్న సిక్ఖు జన సమూహంలో భారత ప్రభుత్వ వ్యతిరేక భావనలు రేగాయి.
 
== మూలాలు ==