బడి పిల్లలతో కలిసి మద్రాసుకు[[మద్రాసు]]కు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ [[ఎన్.టి.రామారావు]] కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని 'నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి జగదేకవీరుని కథ కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలలో [[ఎన్టీఆర్]] సరసన నాయికగా నటించారు.