క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Muraliyelle (చర్చ | రచనలు) చి →ఇవీ చూడండి |
|||
పంక్తి 6:
అయితే ఆర్యుల వేదకాలంనాటి పాత నిబంధనలో భాగమైన యోషయా గ్రంథం 7:14 లో "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును" అని యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. మరియూ యోషయా 9:6 లో "ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును" అని కూడా వ్రాయబడియుంది.
యషయా గ్రంధం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత
బాల్యంనుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేరుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సవరించి క్రొత్త నిబంధన బోధించాడు. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక భోధనలకు పలు యూదులు, మరికొన్ని కులాలవారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందస్తులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాందస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. యూదుల కోరిక ప్రకారం రోమన్స్ ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా శిలువ వేశారు. తర్వాత శిలువ యాగం కారణంగా నిర్యాణం చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు మరియు రోమన్స్ అంగీకరించారు. ఆనాటినుండి క్రైస్తవ్యం అనే మార్గం ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు క్రొత్త నిబంధన రచించారు.
|