త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త ]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక [[జిజ్ఞాసువు]] గా,[[తత్వవేత్త]] గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
 
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన ''[[అసమర్థుని జీవయాత్రజీవయాత్]]ర'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]] లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'' కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది. <ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref>
 
==జీవిత క్రమం==