ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు మరియు ఎస్ పి బాలసుభ్రమణ్యం తో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. [[మైసూరు విశ్వ విద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ పొన్దారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొన్దారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన [[పద్మ భూషణ్]] పురస్కారాన్ని తిరస్కరించారు.
==జననం మరియు బాల్యం ==
'''ఎస్.జానకి''' (S. Janaki) (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) [[దక్షిణ భారతదేశము|దక్షిణభారత]] నేపథ్యగాయని. [[గుంటూరు జిల్లా]], రేపల్లె తాలూకా, -[[పల్లపట్ల]] గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. [[లతామంగేష్కర్‌]], [[పి.సుశీల]], [[జిక్కీ]], [[పి.లీల]] పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని[[చెన్నై]]లోని [[ఏవీయం స్టూడియో]]లో పాడటం ఆరంభించిన జానకి మద్రాసుకు[[మద్రాసు]]కు మారింది.
 
==గాయనిగా తొలినాళ్ళు==
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు