సి. ఆనందారామం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''సి.ఆనందారామం''' [[ఆగస్టు 20]]వ తేదీ [[1935]]వ సంవత్సరం [[పశ్చిమగోదావరి జిల్లా]], [[ఏలూరు]] పట్టణంలో జన్మించింది. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శ గ్రంథాలు వ్రాసింది. ఈమె వ్రాసిన నవల ఆత్మబలి [[సంసార బంధం]] సినిమాగా, అదే నవల జీవనతరంగాలు టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృతి నవలను [[త్రిశూలం]] సినిమాగా, మమతల కోవెల నవలను [[జ్యోతి (1976 సినిమా)|జ్యోతి]]<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/i-cherish-that-compliment/article4063111.ece ‘I cherish that compliment’]</ref> సినిమాగా తీశారు.
==జీవిత విశేషాలు==
ఈమె అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పాస్ అయ్యింది. బి.ఏ. పూర్తయ్యాక సి.ఆర్.ఆర్. కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేసింది. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాం మార్చింది. 1958-60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివింది.[[సి.నారాయణరెడ్డి]] గైడుగా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సంపాదించింది. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా పనిచేసింది. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీవిరమణ చేసింది.
"https://te.wikipedia.org/wiki/సి._ఆనందారామం" నుండి వెలికితీశారు