దేవరకొండ విఠల్ రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''దేవరకొండ విఠల్ రావు''' (జ: [[14 నవంబర్ 14]], [[1947]] - [[మే 5]], [[2016]]) భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. వీరి కుటుంబం [[డి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల]] స్థాపించారు.
==జీవిత విశేషాలు==
ఆయన నవంబరు 14, 1947 న జన్మించారు. ఆయన కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాం పేత మండలం లంగచర్ల గ్రామానికి చెందినవారు. ఆయన 20 యేళ్ల పాటు గాంధీభవన్ లో ఉంటూ పీ.సీ సీ కోశాధికారిగా పనిచేసారు. 2004 లోక్ సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి పోటీ చేసి జితేందర్ రెడ్డి పై గెలుపొందారు. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరారెడ్డికి సన్నిహితంగా మెలిగారు. ఎం.పి.ల ఫోరం కన్వీనరుగా పనిచేసారు.
 
ఎంపీగా పనిచేసిన కాలంలోనే అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మహబూబ్‌నగర్ లో కొన్నేళ్లుగా మూతపడ్డ బోయపల్లి రైల్వే గేటును సొంతనిధులతో ప్రారంభించేందుకు కృషి చేశారు. పద్మశాలి సంఘం రాష్ట్రనేతగా పనిచేసి సంఘం బలోపేతానికి కృషిచేశారు. 2008 లోక్‌సభ ఎన్నికల్లో మహ బూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ప్రస్తుత సీఎం కేసీఆర్ చేతి లో 18 వేల ఓట్లతో ఓడిపోయారు 2014లో కోడంగల్ నుం చి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాక జిల్లాకు రాకపోకలు తగ్గించారు. హైదరాబాద్ శివారులో డీవీఆర్ పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఆయనకు భార్య నిర్మల, ఇద్దరు కౌడు కులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
==మరణం==
గత కొద్ది కాలంగా అనారోగ్యంతోఅఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన తన 60వ యేట [[మే 28]] [[2016]] న కన్నుమూసారు.<ref>[http://prabhanews.com/2016/05/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AC%E0%B1%82%E0%B0%AC%E0%B1%8D-%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%BE/ విఠల్ రావు మృతి]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}