అరికరేవుల సునందా శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
'''అరికరేవుల సునందా శాస్తి ''' [[కర్ణాటక సంగీతం]]లో విధ్వాంసురాలు. ప్రసిద్ధ వైణికురాలు.
==జీవిత విశేషాలు==
ఆమె [[గుంటూరు]] జిల్లా [[పేటేరు]] గ్రామంలో సంగీత కారుల కుటుంబానికి చెందిన శ్రీహరి రావు మరియు సుశీల దంపతులకు జన్మించారు. ఆమె [[మద్రాసు]]కు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించారు. 1954 మరియు 1955 సంవత్సరాలలో ఆమె వోకల్ మరియు వీణ వాద్యాలలో మద్రాసు టెక్నికల్ బోర్డు వారినుండి డిప్లొమా పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అదే సమయం లో ఆమె ఆల్ ఇండియా రేడియో లో సెమీ-క్లాసికల్ మరియు లైట్ మ్యూజిక్ లలో తన సంగీతాన్నందించారు. ఆమె తెలుసు సినిమాకు నేపధ్యగాయకురాలిగా కూడా పనిచేసారు. ఆమె "[[కుంకుమరేఖ]]" , "[[చివరికి మిగిలేది]]" , "[[కలిమిలేములు]]" , "[[పచ్చని సంసారం]]" వంటి సోలో చిత్రాలకు పాటలను పాడటమే కాకుండా హిందీ సినిమా "చోరీ చోరీ" (రాజ్ కపూర్ సినిమా) కు వీణలో తిల్లాన రికార్డింగు లో కూడా పనిచేసారు. ఆమె ఆ సినిమాలో వీణా వాద్యంతో కనిపిస్తారు. ఆమె తండ్రి 1960 లో ఆమెను [[హైదరాబాదు]]కు తీసుకువెళ్ళిన మూలంగా ఆమె నేపద్య గాయకురాలిగా కెరీర్ కు తెరపడింది. కానీ ఆమె తన సంగీతం తో ఆల్ ఇండియా రేడియో లో పనిచేసి అలరించారు.
 
ఆమెకు అనేక బిరుదులు, సత్కారాలు వచ్చాయి. ఆమెకు మధురగాయని అనే బిరుదు వచ్చింది. ఆమె ఎ.యు.స్కూలు ఆఫ్ పైన్ ఆర్ట్స్ లో వోకల్ ఉపాధ్యాయురాలిగా 13 సంవత్సరాలు పనిచేసారు. అదే విధంగా 10 సంవత్సరాలు ఎ.యు. ఉన్నత పాఠశాల లో 1977 వరకు పనిచేసారు.