ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:2013 మరణాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 10:
ప్రియంవద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. అన్న, వదినలతో పాటు [[భువనగిరి]] లో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియంవద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది. 1952లో జరిగిన ఎన్నికల్లో [[నల్లగొండ]] జిల్లాలో పిడిఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. మహిళా హక్కుల సాధన, బాల్యవివాహాల నిర్మూలన, బాలికా విద్య కోసం ఉద్యమం చేపట్టారు. మహిళల కూలీరేట్ల పెంపు కోసం ఆమె రాజీలేని పోరాటం సాగించి, పెద్ద రైతు కుటుంబ నేపథ్యం కలిగిఉన్నఅర్ధశేరు వడ్లు మాత్రమే ఉండే రోజు కూలీని, రెండుశేర్ల వడ్లు కూలీగా ఇప్పించారు.
ఆంధ్రమహాసభలు [[వరంగల్]],
ఊళ్ళల్ల రజాకార్ల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో సొంత ఊళ్ళో వుండకుండా రహస్యంగా ఉండాల్సిన పరిస్థితి కలిగింది. వీరి జాడ చెప్పమని ఆమె తండ్రిని పోలీసులు బాగా హింసించినా ఆచూకీ చెప్పలేదు. అమ్మను, నాన్నను చూసేందుకు ఊరొచ్చింది ప్రియంవద.ఆ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి పదకొండు గంటలకు వచ్చి చేసి స్టేషనుకు తీసుకుపోయి, రెండు రోజులు తుంగతుర్తి క్యాంపుల ఉంచిన తర్వాత సూర్యాపేటకు తీసుకుపోయారు. అక్కడ ఒకరోజు ఉంచి హైదరాబాద్ తీసుకపోయి, చంచల్గూడ జైల్లో బంధించారు. మూడు నెలల తర్వాత బయటికి వచ్చింది.
|