ఆరుట్ల రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల పార్టీ టికెట్ లభించలేదు. అయినా, నల్లగొండ జిల్లాలోని 14 శాసనసభ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు సి.పి.ఐ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషి సలిపారు. 1962 లో భువనగిరి శాసససభ్యునిగా ఎన్నికైనారు.
==జాతీయోద్యమ ప్రభావం==
1930 ఏప్రిల్‌లో గాంధీజీ దండి సత్యాగ్రహం ప్రారంభించారు. దేశమంతటా జాతీయ ఉద్యమం వాయువేగంతో విస్తరించింది. విప్లవ వీరులైన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఉరికంబాలకు ఎక్కి ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి కామ్రేడ్లు.. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. బ్రిటిషర్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు స్వదేశీ లీగ్ పేరుతో హైదరాబాద్‌లోని వికాజీ హోటల్ (అబిదాషాపు) ఆవరణలో బహిరంగ సభలు నిర్వహించేవారు. ఈ జాతీయోద్యమ ప్రభావం రామచంద్రారెడ్డిపై పడింది. కొత్వాల్ రాజా వెంకట్రామారెడ్డి హైదరాబాద్‌లో ‘రెడ్డి బాలుర వసతి గృహం’ స్థాపించి, ఎంతో అభివృద్ధి చేశారు. ఈయన సహకారంతో రామచంద్రారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు ‘బాలికల వసతి గృహం’ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో ఇదే మొట్టమొదటి బాలికల వసతి గృహం.
 
 
 
==తెలంగాణ విముక్తి పోరాటం==
తెలంగాణా ప్రజల విముక్తి కోసం ఏవిధంగానైతే [[చింతలపురి రాంరెడ్డి]] పోరాడారో అదే విధంగా నిజాం నిరంకుశ పాలనను హతం చేయడానికి కుర్రారంకు చెందిన రాంచంద్రారెడ్డి నడుంబిగించారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్న ఘనత ఆరుట్లకే దక్కింది. 1831లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహసభలకు ఈ ప్రాంత విప్లవ వీరుడు రావినారాయణరెడ్డితో కలిసి ఆరుట్ల సైకిల్ పై జోగిపేట వెళ్లారు. గిరిజన, హరిజన వెనుకబడిన వర్గాల ప్రజల్ని నిర్బంధంగా ముస్లీం మతంలోకి మార్పిస్తున్న తరుణంలో రజాకార్లను ఎదిరిస్తూ వారి అరాచకాలను ఎండగట్టడానికి ఆరుట్ల రాంచంద్రారెడ్డి నిజాంకు పోటీగా కొలనుపాకలో ఆర్యసమాజాన్ని నెలకొల్పారు. నిజాం పాలనకు వారి దౌర్జన్యకాండలకు నిరసనగా రాంచంద్రారెడ్డి ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. 1945లో ఆరుట్లను నిజాం అరెస్టు చేసి కొలనుపాకలో నిర్భందించింది. ఆయన్ను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేశారు. మూడేళ్ల పాటు నిర్భందించారు. రాంచంద్రారెడ్డి కొనసాగిస్తున్న ప్రతి ఉద్యమానికి ఆయన భార్య కమలాదేవి ఊపిరిగా నిలిచింది. దీంతో 1949 ప్రాంతంలో కమలాదేవిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణా కోసం ప్రాణాలర్పించిన మహోన్నతమైన నాయకుడిగా ఆరుట్ల రాంచంద్రారెడ్డి పేరు చిరకాలం నిలిచిపోతుంది.