జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మహమ్మదీయ పరిపాలన కాలంలోనుండి వాడుకలోనుండిన అనేక పార్శీ మరియూ ఉరుదూ మాటలలో '''జమాబందీ''' ('''Jamabandi''') వకటి తదుపరి ఆంగ్లేయ పరిపాలనలో కూడా అమలులోనుండి విశాలాంధ్రదేశములో 20 శతాబ్దములో కరణీకములు అంతరించే వరకూ అమలు లో నుండిన జమాబందీని తరచూ ప్రతిఏటా జిల్లాలవారీగా జరిగే [[శిస్తు]] నిర్ణయాలకు చేసే సమావేశములనే కాక అరుదుగా ఎప్పుడోవకసారి జరిగే [[ఇనాముల]] ఫైసలా సమావేశములకు కూడా జమాబంది అంటారని చరిత్రచెప్పుతున్నది.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)"> " 'జమాబందీ దండకము'-చరిత్రాంశాలు" దిగవల్లి వేంకట శివరావు.సమాలోచన 01/12/1984 </ref>, <ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)"> " 'కరణాల భోగట్టా- కమిటీ ఉత్తరం' ", దిగవల్లి వేంకట శివరావు. ఆంధ్రప్రభ 21/06/1987</ref> బ్రౌను నిఘంటువులో జమాబంది అంటే “Yearly settlement of accounts made by Revenue Department under ryotwari system” అని అర్ధము చెప్పబడియున్నది
== కవులు వర్ణించిన జమాబందీ చరిత్రలు==
క్రీ. శ 1835 లో [[కాకినాడ]] లో జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీని [[కుందూరి దాసన్నకవి]] [[ దండకం]] గా వర్ణించియుండగా అంతకు పుర్వము క్రీ.శ 1799 లో [[విశాఖపట్టణం]] లోజరిగిన ఇనాములకు సంబందించిన జమాబందీ ని [[వర్దిపర్తి కొనరాట్కవి]] [[ సీసమాలిక]] పద్యములోవర్ణించారుగా వర్ణించారు
===‘జమాబందీ దండకము’===
క్రీ.శ 1835 మే నెలలో కాకినాడలో జరిగిన జమాబందీని దండకములాగ వర్ణించుతూ చేసిన సాహిత్యం[[కుందూరి దాసన్న కవి]] రచించిన ‘జమాబందీ దండకము ’. కుందూరి దాసన్నకవి గారి జీవిత విశేషాలు, పుట్టు పూర్వోత్తరాలను గూర్చి సమాచారమేమీ లేకపోయునప్పటికీ దాసన్నకవి గారు రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అరుదుగా లభించే 19వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రచురణగుటయే కాక ఆ కాలపు పారిభాషిక పదమైన ‘జమాబందీ’తో పరిచయంచేసి (చూడు [[పారిభాషిక పదకోశం]]), ఆ జమాబందీ ఎంత హడావుడిగా జరిగేదీ, బ్రిటిష్ వారి పరిపాలనలో రెవెన్యూ లెఖ్కలు ఏవిధంగా కట్టుదిట్టమైన సారధ్యముతో నడిచేవీ తెలియజేయు రచన. 1974 లో [[దిగవల్లి వేంకట శివరావు]]గారు సంకలనంచేసి [[గ్రామోద్యోగి పత్రిక]]సంపాదకులు [[ పసుపులేటి కృష్ణయ్య]]గారి ముద్రాక్షరశాలలో ముద్రించి ఈ రచనను ప్రకటించారు. శివరావు గారి చేతి వ్రాతలోనున్న అముద్రిత పీఠిక వలన కుందూరి దాసన్న కవి రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అనే రచన యొక్క చేతివ్రాత ప్రతి మహాకవి [[దాసు శ్రీరాములు]] (1848 -1908) గారి వద్ద యుండినదనియూ, వారి కుమారుడు [[దాసు కేశవరావు]] గారు 1897 లోమొట్టమొదటి సారిగా దీనిని సంకలనంచేసి వారి [[వాణీ ముద్రాక్షర శాల]]( చూడు [[దాసు విష్ణు రావు]] గారు), బెజవాడలో ముద్రించి ప్రచురించారనియూ తెలియుచున్నది. ఈ దండకములో అనేక గ్రామాల పేర్లు, పదవులు, పదవులహోదాలు, పదవుల్లోనున్న ఉద్యోగులు అమీనులు,బంట్రోత్తులు పేర్లుతో సహా, అప్పటి స్తితిగతులు, దండక రూపంలో వర్ణించిన ఆ సాహిత్యము చరిత్రాత్మకమైనదికూడా.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)"/>.
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు