జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
[[అడిదెం రామారావు]] గారు రచించిన [[ విస్మృత కళింగాంధ్ర కవులు]] అను పుస్తకములో [[వర్దపర్తి కొనరాట్కవి]] రచించిన 'కరణాల భోగట్ట-కమిటీ ఉత్తరం' లో ఇనాముల ఫైసలాకు క్రీ.శ 1799లో విశాఖపట్టణంలో చేసిన జమాబందీ ని వర్ణించిన సీసమాలిక పద్యము వున్నదని ఆంధ్రప్రభ 21-06-1987 న దిగవల్లి వేంకట శివరావు గారు ప్రచురించిన వ్యాసము...సశేషం
===== సీసమాలిక లోని వివరాలు=====
ఆడిదెం రామారావుగారి కళింగాంధ్రకవులు అను పుస్తకములో ప్రచురితమైన వద్దిపర్తివర్దిపర్తి కొనరాట్కవి (1754-1834) రచించిన 'కరణాలభోగట్టా-కమిటీఉత్తరం' అనే సీసమాలిక లో అనేక ఉర్దూ-తెలుగు మాటలు కలిగియున్న రచనను 1987 ఆంధ్రప్రభలోఆంధ్రప్రభ వ్యాసము లో దిగవల్లి వేంకట శివరావుగారు కొన్ని మాటలకు అర్ధము వివిరించి ప్రచురించారు. ఆ సీసమాలిక మొదలు "బారాన్ననౌఫసలీ యాదాస్తు పరగణా ఉప్పనాపక్కినాడు పిబరేవరిఫిబరేవరి తేది భిన్నవోరోజర్సరికి కరణాల భోగట్ట వినుడి". అని మొదలు పెట్టి ".................. మీ మధురాలెన్నిమీయడ భూమెంత? మీవూరుబీడెంత? మెట్టెంత? పదునాలుగేళ్ళ కు పంటెంత ఖిర్డెంత వ్రజలెంత నాగళ్ళు నాఖిర్డు నాడెంత డవులెంత చెల్లెంత బాకెంత శిస్తెంత పల్లపుభూమెంత మెట్టఎంత".........". ".....పూర్వపుమాన్యముల్ తరువాతమాన్యముల్ కొన్న భూముల్ ప్రతిగొన్నయట్టి కరవులోగడలెఖలు పోయెమావద్ద కరువులెఖలు కానరావు రెండేండ్ల లెఖలు లేవు నాదగ్గర మూడేడ్ల లెఖలుబోయమాకు నాలుగేళ్ల జాడనాదగ్గరనులేవు కడిగి ఐదేళ్ల కాకరములేదు...................." “………..తాటియాకులువిప్పి తారుమారులచేసి దీపాలముందర తిరుగవేసి ఆరుఏడ్నేల్లు వీరు చికాకుపడిరి గాన వారిని రక్షించి కరుణజేసి శలవువేగంబొసగవే సారసాక్షవినుత గౌరీశవుపమాక వెంకటేశ” అని సమాప్తిచేసిన సీసమాలిక ద్వారా కొనరాట్కవి ఆ ఇనాముల జమాబందీకోసం కరణాలు తయారుచెయవలసిన Memorandum కోసం వారు పడేతంటాలు దయానీయకంగానుండినవని వాళ్ళను రక్షిెెంచమని పరిపాలకుడైన ఆంగ్ల కంపెనీ దొరకు తెలియజేసినాడట.
ఇందులో కల కొన్ని క్లిష్టమైన ఉరుదు-తెలుగు మాటలు ఆ కాలంనాటివి కొన్ని మచ్చుకు మరియూ వాటి అర్ధాలు ఉదహరించబడ్డాయి.<ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)"/>
బారన్ననౌ ఫసలీ 1209 ఫిబరేవరి అంటే క్రీ.శ 1799 ఫిభ్రవరి మాసం.
యాదాస్తు అంటే Memorandum
డౌలు అంటే అంచనాలెఖ రావలసిన సిస్తు
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు