చూపులు కలిసిన శుభవేళ: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → using AWB
కథ విస్తరించాను
పంక్తి 8:
starring = [[నరేష్]],<br>[[మోహన్]],<br>[[గాయత్రి]],<br>[[అశ్వని (నటి)]], <br>[[సుత్తి వీరభద్రరావు]], <br>[[నూతన్ ప్రసాద్]]|
}}
 
'''చూపులు కలసిన శుభవేళ''' జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హాస్యభరితమైన సినిమా. ఇది [[సుత్తి వీరభద్రరావు]] ఆఖరి సినిమా కూడా. సినిమా పూర్తికాకముందే ఆయన చనిపోతే ఆయన పాత్రకు జంధ్యాల గాత్రం అందించారు.
== కథ ==
ఆనంద మోహన్ (మోహన్) పాండురంగం ([[సుత్తి వీరభద్రరావు]]) ఆఫీసులో పని చేస్తుంటాడు. పాండురంగం అన్న నాగలింగం ([[నూతన్ ప్రసాద్]]) కూతురు పద్మ ([[అశ్వని (నటి)]]) వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. మోహన్ ఆమె ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. మోహన్ తన స్నేహితుడైన లక్ష్మీ ప్రసాద్ ([[విజయ నరేష్]]) రాసిన లేఖ అందుకుని అతని ఉండే ఊరు వెళ్ళి అప్పుల బాధ భరించలేక చనిపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న అతన్ని పట్నం లో ఏదైనా ఉద్యోగం చూపిస్తానని తన వెంట తీసుకుని వస్తాడు.
 
మోహన్ తన ప్రేమ విషయం పాండురంగానికి తెలియజేయడానికి భయపడుతూ ఉంటాడు. అందుకోసం లక్ష్మీ ప్రసాద్ ను పాండురంగం చేతిలో పలు ఇబ్బందులకు గురి చేస్తాడు. చివరికి పాండురంగానికి విషయం తెలిసి వారి ప్రేమను అంగీకరిస్తాడు. కానీ అన్న నాగలింగానికి మాత్రం ప్రేమంటే పడదు. దాంతో వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చి ఆస్తులు పంచుకుంటారు. ఇది చూసి వారి కన్నతల్లి చాలా బాధ పడుతుంది. వారినందరినీ కలపడానికి మోహన్, లక్ష్మీ ప్రసాద్ లు తమ ప్రియురాళ్ళతో కలిసి ఎలా నాటకం ఆడారన్నది మిగతా కథ.
== నటన ==
పాండురంగానికి నడక అంటే ఎంతో ఇష్టం. తనకోసం వచ్చిన వాళ్ళని చాలా దూరం నడిపించి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన కారులో ఇంటికి వచ్చేస్తుంటాడు. ఈ సన్నివేశాలు హాస్యం పండిస్తాయి. ఆనంద్ తండ్రి కోట శ్రీనివాస రావు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష కూడా హాస్యం పండించింది.
 
[[వర్గం:1988|తెలుగు సినిమాలు]]