సోమనాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
===ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ ===
1782-1783ల మధ్య''' శ్రీనాధ్ మహదాజీ షిండే ''' (ఉజ్జయిని, గ్వాలియర్ మరియు మధుర పాలకుడు) లాహోరు పాలకుడైన ముహమ్మద్ షాహ్‌ను ఓడించిన తరువాత విజయోత్సాహంతో లాహోరు నుండి మూడు వెండి ద్వారాలను తీసుకువచ్చాడు. గుజరాత్ పండితులు ఆ చర్యను నిరాకరించడంతో పాలకుడైన గైక్వాడ్ వాటిని సోమనాధ ఆలయంలో పెట్టించాడు. ఈ ద్వారాలు ప్రస్తుతం ఉజ్జయిని ఆలయాలలో ద్వారములుగా నిలబడి ఉన్నాయి. ప్రస్తుతం వాటిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ మందిరం మరియు గోపాల్ మందిరంలలో చూడ వచ్చు. 1842లో '''1 ఎర్ల్ ఆఫ్ ఎడిన్బర్గ్''' కు చెందిన '''ఎడిన్బర్గ్''' ప్రసిద్ధిచెందిన '''ప్రొక్లెమేషన్ ఆఫ్ గేట్స్ ''' పేరుతో చేసిన ప్రకటనలో ఆఫ్ఘనిస్థాన్ లోని గజనీలో ఉన్న '''గజనీ మహ్ముద్''' సమాధిలో ఉన్న ఈ ద్వారాలను గజనీ నుండి తీసుకు వచ్చి భారతప్రభుత్వానికి అందించమని ఆదేశాలను జారీచేసాడు. వీటిని గజనీ మహ్ముద్ సోమనాధ్ ఆలయం నుండి తీసుకు వెళ్ళబడినట్లు విశ్వసించబడింది. సోమనాథ ఆలయ ఈ ద్వారాల గురించిన చర్చ '''1843లో లండన్లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ''' జరిగినట్లు అధారాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య జరిగిన చెలరేగిన చర్చల మంటల తరువాత ఈ ద్వారాలు వెలికి తీసి విజయవంతంగా వెనుకకు తీసుకురాబడ్డాయి. కాని వచ్చిన తరువాత అవి అసలైన ద్వారాలకు ఖచ్ఛితమైన నమూనాలని తెలుసుకున్నారు. అవి ప్రస్తుతం ఆగ్రా స్టోర్ రూమ్ లో ఇంకా అలా పడి ఉన్నాయి.
==సోమనాథుడు విలీనం==
[[ద్వాదశ జ్యోతిర్లింగాలు|ద్వాదశ జ్యోతిర్లింగాలలోని]] [[శివుడు|శివనామములలో]] ఒక పేరు '''సోమనాథుడు'''. సోమనాథుడు ఉన్న ఆలయాన్ని సోమనాథ్ దేవాలయం అంటారు. ఈ దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రాలోని వెరావల్‌లో ఉన్న [[సోమనాథ్]] లో ఉంది. సోమనాథ్ ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రముగా విరాజిల్లుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని "ప్రభాస తీర్థం" అని కూడా పిలుస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/సోమనాథ్" నుండి వెలికితీశారు