వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==కార్యకాల ముఖ్యాంశాలు==
1750 లో మొట్టమొదటిసారిగా భారతదేశములో ఈస్టుఇండియా కంపెనీ కలకత్తా లో (writer) గుమాస్తాగా పనిలోప్రనేశించి తరువాత కంపెనీవారి ఒక ప్యాక్టరీకి నిర్వాహకుడుగా చేశాడు. 1753లో వంగరాష్ట్ర రాజధాని [[ముర్షీరాబాదు]] కి సముద్రతీర వ్యాపార కేంద్రమైన [[ఖాసింబజారు]]లో పనిచేశాడు. 1757 ప్లాసీ యుధ్ధమప్పుడు ఇతని నైపుణ్యమును గుర్తించిన రాబర్టు క్లైవు యుధ్ధానంతరం కలకత్తాను విడిపించి తన అనుగ్రహ పాత్రుడైన [[మీర్ జఫర్]] ను నవాబుగా చేసి ఆ నవాబుగారి రాజధాని ముర్షీరాబాదు లో 1758లో హేస్టింగ్సు ను కంపెనీ ప్రతినిధిగానూ(Resident), నవాబుగారి సలహాదారునిగా వ్యవహరించుటకు నియమించాడు. 1761 లో పదోన్నతి తో కంపెనీ పరిపాలక యంత్రాంగమైన (కౌన్సిల్) సంఘ సభ్యునిగా కలకత్తా లో నియమింపబడ్డాడు. 1761-1765 నాలుగేండ్లలో వంగరాష్ట్రములోని పరిపాలన, కంపెనీ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం, స్వంతవ్యాపారములు, ప్రజాపీడనలు చాలా విషమస్తితికి దారితీశాయు. (చూడు[[ రాబర్టు క్లైవు]] కార్య సమీక్ష, వంగరాష్ట్ర చరిత్ర,[[ ప్లాసీయుద్ధం ]]). ఆ పరిస్థితులను ఖండించతూ హెస్టింగ్సుకౌన్సిల్లో తన అభ్యంతరాలు నమోదు చేయటంతో కౌన్సిల్లోని ఇతర సభ్యులతో వైషమ్యాలేర్పడ్డాయి . అట్టి విషమ పరిస్తితులలో వంగరాష్ట్ర నవాబు మీర్ జఫర్ పోయి తరువాత వచ్చిన [[మీర్ ఖాసిం]], ఒరిస్సా నవాబుతో కలసి కంపెనీకి ఎదురు తిరిగటంతో 1764 అక్టోబరులో [[ బక్సార్ యుద్ధం]] జరిగింది. యుద్ధానంతరం 1764 నవంబరు లో హేస్టింగ్సు రాజీనామాచేసి ఇంగ్లండుకు వెళ్ళిపోయాడు . 1768 లో మరల కంపెనీలో చేరినప్పుడు రెండవ విడత కార్యకాలం మొదలైంది. మద్రాసుకౌన్సిలో సభ్యునిగా 1769 మార్చిలోమద్రాసులోతిరిగి పనిలోప్రవేసించాడు. ఈ రెండవవిడత చెన్నపట్నం కార్యకాలంలో(1769-1771) [[కర్నాటక రాజ్యం]] రాజకీయాలలో హేస్టింగ్సు జోక్యముచేసుకోలేదు(చూడు [[ రాబర్టు క్లైవు]],కర్నాటక రాజ్య చరిత్ర). అటుతరువాత 1772 లో తిరిగి కలకత్తానందలి వంగరాష్ట్ర కంపెనీ కౌన్సిల్ లో సీనియర్ సభ్యునిగా గర్నరు కార్టియర్ క్రింద పనిచేయుటకు బదలీచేయబడ్డాడు. కొద్దిరోజలకే గవర్నర్ కార్టియర్ పదవీవిరమణానంతరం 1772 ఏప్రిల్ లో వారన్ హేస్టింగ్సు[[విలియమ్ కోట]]కు గవర్నరైనాడు.1773లో రెగ్యులేటింగ్ చట్టం అమలోకిరాగనే వారన్ హైస్టింగ్సు మొదటి గవర్నర్ జనరల్ గా నియమింపబడ్డాడు. గవర్నర్ జనరల్ గా 1773 ఏప్రిల్ నుండీ వారన్ హేస్టింగ్సు కార్యకాలం చాలాఒడుదుడుకులతో కూడినదై అనేక సమశ్యలెదురైనవి. కంపెనీ కౌన్సిల్ సభ్యుల (Gen.CLAVERING, Colonel MONSON) వైషమ్యాలతోకూడిన ఆరోపణలు, వారన్ హేస్టింగ్సు వంగరాష్ట్రపరిపాలనలో అవినీతికిపాల్పడి 40 లక్షలు లంచం తీసుకున్నాడని కలకత్తాలోనికలకత్తాలో ప్రముఖపౌరుడైన నందకుమారుడునందకుమారుడనునతడు కౌన్సిలుకు చేసిన ఆరోపణలకు ప్రతీకారంగా హేస్టింగ్సు నందకుమారునిపై ప్రత్యారోపణమోపి జైలుశిక్షవిధించి,చివరకు ఆకేసును కలకత్తా సుప్రీంకోర్టుకెక్కించి అప్పటిలోకలకత్తాసుంప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,తనకి బాల్యమిత్రుడైన సర్ ఎలిజా ఇంపే దొరచే (Sir ELIJAH IMPEY)విచారణజరిపించి ఉరిశిక్ష విధించి ఉరితీయించటం, గవర్నరుగామొదటిలో చేసిన రాజకీయసంస్కరణల దుష్ఫలితములిచ్చినవని, గవర్నర్ జరల్ హేస్టింగ్సు ఆర్ధిక లాభంకోసం అనవసరమైన యుద్ధములుచేయించాడనీను(రోహిల్లా యుద్ధం, కూచ్ బిహారుయుద్దం) మొదలగువాటిని చూపుతూ కలకత్తా కౌన్సిల్ లోని సభ్యులు తదుపరి లండనులో కామన్సు సభ సభ్యులైన ఫిలిప్ ఫ్రాన్సిస్(PHILIP FRANCIS), EDWARD BURKE, మొదలగువారి ఆరోపణలపై లండన్ పార్లమెంటు(హౌస్ ఆఫ్ లార్డసు) వారిచే విచారణజరిపబడింది. చివరకు 1785 ఫిబ్రవరి లో రాజీనామా చేయవలసివచ్చినది 1786 లో పార్లమెంటులో ఇంపీచ్ చేయబడ్డాడు. ఆ తరువా రెండేండ్లకు(1788) విచారణ మొదలైంది. ఇంకా ఆతరువాత ఏడేండ్లకుగానీ తీర్పువిలువడలేదు.చివరకు 1795 లో హౌస్ ఆఫ్ లార్డ్సువారు నాట్ గిల్టీ తీర్పు ఇచ్చారు సశేషం
=== వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు===
వంగరాష్ట్ర గవర్నర్ గా 1772లో పదవీ స్వీకారంచేసిన తరువాత వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు (1)ప్రబుత్వ యంత్రాంగమును కదలించి వంగరాష్ట్ర రాజధానిని ముషీరాబాదునుండి కలకత్తా తరలించాడు. 1767 కంపెనీ చట్టప్రకారము కంపెనీ రాబడి లో కొంత భాగము బ్రిటిష్ ప్రబుత్వమువారికి కట్టవలసినదేకాక, తమ కంపెనీకి కూడా కట్టవలసివచ్చెను. దాంతో బ్రిటిష్ ఇండియా పరిపాలకసంఘం ఆర్దికస్తితి దిగజారుతూ ఋణగ్రస్తములోకి దిగింది. అందుకని వారనా హేస్టింగ్సు అనేక మార్గములద్యారా ఆదాయం పెంపొందిప నిశ్చయించాడు. (2) వంగరాష్ట్ర నవాబు అధికారమునుండి తొలగించునప్పుడు రాబర్టు క్లైవు చేసిన వప్పందంప్రకారం సాలునా ఇయ్యవలసిన అలవెన్సు 53 లక్షలను క్లైవు కాలంలోనే రెండవనవాబు పదవిలోకి వచ్చినప్పుడు 41 లక్షలకు తరువాత వచ్చిన ఇంకో కొత్తనవాబుకు 32 లక్షలకు తగ్గించబడినదానిని గవర్నర్ వారన్ హేస్టింగ్సు ఇంకా తగ్గించి 16 లక్షలకు చేశాడు, అలాగే ఢిల్లీలోని చక్రవర్తిషా ఆలం కి క్లైవుచేసిన వప్పందం ప్రకారం ఇయ్యవలసిన ఇరవైఆరు లక్షలరూపాయల సాలూనాచెల్లించు కప్పమును మొత్తం ఆపేయటమేకాక షా ఆలం కు క్లైవు ఇచ్చిన [[అల్ హాబాదు]] పరణాలనూ, [[కోరా]] పరగణాలనూ(పశ్చమ ఒరిస్సాలో ని ప్రాంతం) వెనక్కి తీసేసుకుని ఒరిస్సానవాబు అయోధ్య(అవధ్)షూజా కుఉద్దౌలా నవాబుకు 50లక్షల రూపాయలకు వెచ్చించటమే కాక, మరాఠా దండులు [[రోహిల్లా]] మీదకు దాడికి వస్తే సైనిక సహాయంచేయటానికి ఇంకా నాలుగులక్షలు నవపసులునవరసులు వసూలుచేశాడు. వంగరాష్ట్ర నవాబు ను, చక్రవర్తి షా ఆలమునూ దుస్తితి కి పాల్చేశాడు. (3)వంగరాష్ట్రమును కొన్ని జిల్లాలుగావిభజించి పన్నుల వసూలుకొరకు ప్రాతదేశీయోద్యుగులను తొలగించి జిల్లాకొక కలెక్టరును, నలురైదుగురు కలెక్టర్లపై ఒక కమీషనరు ను నియమించాడు. వీరందరిపైనా కలకత్తాలో రెవెన్యూబోర్డును ఏర్పరచాడు. కలెక్టర్లు సరాసరి పన్నులు వసూలుచేయకుండా పన్నుల వసూలుహక్కును ఆ విధముగా వేలంవేయించి వేలంపాట లో ఎవరైతే అధికంగా పాడిరో వారికి సిస్తు వసూలు చేసే హక్కు ఇచ్చారు. అలాగ సిస్తు వసూలు చేసుకున్నవారే[[ఇజారాదారులు]] . ఆ ఇజారా దారులునే మొదట దివానులనేవారు. తరువాత వారిలో చాలమంది జమీందారులైయ్యారు. (4) జిల్లా కలెక్టర్లకే న్యాయవిచారణచేయు అదికారమీయబడినది. కలెక్టర్ల కోర్టులే క్రిందికోర్టు, దానిపైన అప్పీలు కోర్టును సదర్ దివానీ అదాలత్ అను సివిల్ కోర్టును, సదర్ నిజామత్ అదాలత్ అను రెండు ఉన్నత కోర్టులను స్థాపించబడ్డాయి. అలా వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలవల్ల నూతన న్యాయస్తానాలు నెలకొల్పబడనవి, న్యాయ విచారాణాధికారము ఇంగ్లీషువారు చేబట్టి ఆంగ్లేయధర్మశాస్త్రములను అమలుచేయటంవల్ల దీర్ఘకాలంనుండీవస్తున్న హిందూ మహ్మదీయ సాంప్రదాయలకు ఆటంకమైనవి. సశేషం
 
===వారన్ హేస్టింగ్సు కార్యకాలంలోజరిగిన యుద్ధాలు===
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు