ఏ.పి.జె. అబ్దుల్ కలామ్: కూర్పుల మధ్య తేడాలు

124.123.109.62 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1918261 ను రద్దు చేసారు
పంక్తి 115:
 
==ఇతరాలు==
* "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడ్ని. స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుkkkkkkkkకొచ్చేసరికిచేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్ తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాడ్ని. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పని చేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. 'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడ్ని. దానికి తోడు చదువుకుంటూ.. పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం.. విషాదం రెండూ ఉండేవి'
* '''ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం''' తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ.. ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి.. మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు 3.8.2008)
* ప్రస్తుత [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[ధనుష్కోడి]]లో ఒక [[మధ్యతరగతి]] [[ముస్లింలు|ముస్లిం]] కుటుంబంలో పుట్టిన ఆయన [[1958]] లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి [[ఏరోనాటికల్ ఇంజినీరింగు]] లో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు [[రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ]] డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన [[హోవర్ క్రాఫ్ట్]] (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. [[1962]] లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) [[ఇస్రో]] కు మారారు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ [[ఉపగ్రహం|ఉపగ్రహాలను]] విజయవంతంగా ప్రయోగించారు. [[రోహిణి (ఉపగ్రహం)|రోహిణి]] ఉపగ్రహాన్ని జూలై [[1980]] లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ [[ఉపగ్రహ ప్రయోగ వాహనం]] ([[SLV-III]]) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది. [[1982]] లో, ఆయన DRDO కు డైరెక్టరు గా తిరిగి వచ్చి, [[గైడెడ్ మిస్సైల్]] (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. [[అగ్ని క్షిపణి]] మరియు [[పృధ్వి క్షిపణి]] మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై [[1992]] లో ఆయన భారత దేశపు [[రక్షణ మంత్రి]]కి సాంకేతిక సలహాదారు అయ్యారు. [[భారత్|భారత ప్రభుత్వానికి]] ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు [[క్యాబినెట్ మంత్రి]] హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే [[1998]] లో [[పోఖ్రాన్-II]] [[అణుపరీక్షలు]] విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని [[అణ్వస్త్ర రాజ్యం|అణ్వస్త్ర రాజ్యాల]] సరసన చేర్చాయి.