కాటూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
'''కాటూరి వెంకటేశ్వరరావు''' ఒక తెలుగు కవి, రచయిత, నాటకకర్త, అనువాదకుడు. జన్మస్థలం [[కాటూరు (వుయ్యూరు)]] . ఇతను [[బందరు]] నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతను, మరియు [[పింగళి లక్ష్మీకాంతం]] కలిసి '''పింగళి కాటూరి కవులు''' అనే జంటకవులుగా ప్రసిద్దులయ్యారు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. కావ్యాలు వ్రాశారు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1895]], [[అక్టోబరు 15]]వ తేదీన [[కృష్ణాజిల్లా]], [[వుయ్యూరు]] మండలం, [[కాటూరు (వుయ్యూరు)|కాటూరు]] గ్రామంలో జన్మించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=208-213|edition=ప్రథమ|accessdate=29 July 2016|language=తెలుగు|chapter=అవధాన విద్యాధరులు}}</ref>. ఇతని తల్లిదండ్రుల పేర్లు రామమ్మ మరియు వెంకటకృష్ణయ్య. ఇతడు కాటూరు, గుడివాడలలో ప్రాథమిక విద్యను ముగించుకుని, బందరు హిందూ హైస్కూలులో స్కూలు ఫైనలు పూర్తిచేసుకుని ఇంటర్మీడియట్, బి.ఎ. బందరులోనే చదివాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో సహాయనిరాకరణ ఉద్యమంలోను, ఉప్పు సత్యాగ్రహంలోను చురుకుగా పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలుశిక్షను అనుభవించాడు.
ఇతడు 1933-39 సంవత్సరాల మధ్య ఆంధ్రోపన్యాసకుడిగా, 1939-43ల మధ్య వైస్ ప్రిన్సిపాల్గా, ప్రిన్సిపాల్గా పనిచేశాడు. 1945-53ల మధ్య [[కృష్ణా పత్రిక]]కు సంపాదకుడిగా పనిచేశాడు.
|