వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
కూచ్ బీహారు అను వంగరరాష్ట్రములోని చిన్నరాజ్యమును 1772-73 లో జిధార్ అను భూటాన్ రాజు ముట్టడించినప్పుడు కూచ్ బీహారు పరిపాలించుచున్న రాజు బ్రిటిష్ వారి ప్రతినిధిగానున్న వారన్ హేస్టింగ్సును సైనిక సహాయం కోరగా కూచ్ బీహారులో జరిగిన యుద్ధం. ఆతరువాత వారన్ హేస్టింగ్సు కాలంలో జరిగిన రోహిల్లా యుద్ధం(1773-1774). వారన్ హేస్టింగ్సు గవర్నరు జనరల్ గానుండగా జరిగిన రెండవ మైసూరు యుద్ధం. 1780 హైదర్ అలీ తో జరిగిన మైసూరు యుధ్దము లో బ్రిటిషవారి మిత్రకూటమిలోనున్న హైదరాబాదు నిజాము గారు చేస్తానన్న సహాయం చేయక పోబట్టి బ్రిటిష్ వారి సైన్యాధిపతి జనరల్ ఐర్ కూట్ తో యుద్దము జరుగుచుండగా 1782లో హైదర్ అలీ చనిపోగా అతని కుమారుడు టిప్పుస్తుల్తాన్ యుధ్దము సాగించెను. చివరకూ ఎటూ తేలకుండా బ్రిటిష్ వారి తరఫున వారన్ హేస్టింగ్సు టిప్పుతో రాజీ చేసుకున్నాడు.
====రోహిల్ఖండు చరిత్ర, రోహిల్ఖండు యుద్ధం (1773-1774) ====
రోహిల్ఖండు ఉత్తరహిందూదేశములో ఇప్పటి ఉత్తరాఖండు రాష్ట్రములో వాయవ్యదిశన నేపాలు దాకా యుండిన పరగణాలు మొగల్ చక్రవర్తి 17 వశతాబ్దములో అఫగన్ ధేశీయులగు [[రోహిల్లాలు]]అను [[పధానులు]]కిచ్చాడు. అందువల్ల ఆ పరగణాలుగల రాజ్యమును రోహిల్ఖండు అనబడియున్నది. ఆ రాజ్యములో ఇప్పటి[[బరైలీ]], [[రుద్రపూరు]], [[రామ్ పూరు]], [[మొరాదాబాదు]] మొదలగు పట్టణములున్న జిల్లాలు కలవు . 1752లో రోహిల్ ఖండుకు ఆనుకుని యున్న [[ ఔధ్ రాజ్యము]] నవాబు (మొగల్ చక్రవర్తికి సుబేదారుడు) సప్దర్ జంగ్ నవాబు గారు తనకు సైని సహాయము చేయమని మరాఠా సైనిక దళమును ఆహ్వానించి రోహిల్లాలను పారత్రోల ప్రయత్నించాడు. అప్పటినుండీ ఔద్ నవాబుకు రోహిల్ ఖండును పూర్తిగా వశంచేసుకోటానికి యుధ్దాలు జరుపుతూనే వున్నట్లునూ, మరాఠీదండులు రోహిల్ఖండుమీద దాడలుజరుపుచున్నటులనూ తెలియుచున్నది. 1773-1774 లో మరాఠా సైనిక దళాలు రోహిల్ఖుండు మీద దాడీకి వస్తున్నారని తెలియగనే ఎక్కువగా సైన్యము కలిగియుండని ఔధ్ నవాబు, షూజాఉద్దౌలా భయపడి తనరాజ్యముపైకి వస్తారేమోనని ముందుజాగ్రత్తగనే తనకు అండగా బ్రిటిష్ సైనిక బలగమును సహాయంకోరాడు. అలాంటి ఆకాంక్షలకోసమే వేచియుండిన బ్రిటిష్ వారికి అప్పటిలో గవర్నరు జనరల్ గానుండిన వారన్ హేస్టింగ్సుకు కుటిల రాజతంత్రము ప్రయోగించుటకు గొప్ప అవకాశం కలిగినందుకు సంతోషముతో ముందుకువచ్చివారి షరత్తులకు వప్పుకున్న ఔధ్ నవాబు కు తమ సైనికి బలగమును పంపిచాడు. ఆ యుద్దమే రోహిల్ఖండు యుద్దమని ప్రసిధ్ధి చెందినది. వాస్తవానికి యుధ్ధం జరుగకుండానే మరాఠీదండులు అనివర్య కారణాలవల్ల వెనక్కి వెడలిపోయారు. కానీ ఔధ్ నవాబువద్దనుండి వారన్ హేస్టింగ్సు యుధ్ధపు ఖర్చుల క్రింద 2 లక్షల కు పైగా రొక్కము వసూలు చేయటమే గాక అప్పటినుండీ ఆనవాబు బ్రిటిష్ వారి చేతులలో కీలుబొమ్మగా అయినాడు
 
=== రెండవ మైసూరు యుద్ధం (1780-1784)===
రెండవ మాసూరు యుధ్ధం 1780లో [[హైదర్ అలీ]] [[ఆర్కాటు]] ను ముట్టడించడం అతని కుమారుడు [[టిప్పుసుల్తాన్]] పోలిలూరు (పెరంబాగం)లో బ్రిటిష్ వారిసైన్యాదిపతి కర్నల్ [[విలియం బైలీ]] (William Baillie) ని యుద్ధములో ఓడించి [[శ్రీరంగపట్టణం]] లో బందీగానుంచటం. అలాగే ఇంకో బ్రిటిష్ సైన్యదిపతి బ్రైత్వైట్ (Braithwait) ను కుంబకోణంలో ఓడించి శ్రీరంగపట్టణం లో బందిగానుంచాడు. ఆయుద్ధమువలన బ్రిటిష్ వారి కి చలా తీవ్రమైన ఓటమి తీరని అపర్దిష్ట కలిగింది. అప్పుడు వారన్ హేస్టింగ్సు తన సేనాధిపతి ఐర్ కూట్ (Eyre Coote) ను హైదర్ అలీ పై యుద్ధమునకు పంపాడు. పోర్టోనోవో (పరంగిపెట్టై) లో 1782 జరిగిన ఆ యుద్దము లో హైదర్ అలీ ఓడిపోయిన తరువాత మరణించాడు. 1783లో ఐర్ కూట్ కూడా మరణించాడు.
 
==వారన్ హేస్టింగ్సుకార్యకాల సమీక్ష==
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు