పురిపండా అప్పలస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== జననం ==
వీరు [[విజయనగరం]] జిల్లా, [[సాలూరు]] గ్రామంలో [[నవంబరు 13]], [[1904]] సంవత్సరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొంతకాలం జరిపి, పిదప స్వయంకృషి వలన ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక [[ఒరియా]], [[హిందీ]], [[బెంగాలీ]], [[ఆంగ్ల]] భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. వీరు [[మహాత్మాగాంధీ]] నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, హరిజనోద్యమం మరియు ఖాదీ ప్రచారము లలో అత్యంత శ్రద్ధతో పాల్గొన్నారు. విశాఖపట్నంలో[[విశాఖపట్నం]]లో అఖిల భారత చరఖా సంఘం వారి ఖాదీ భాండాగారంలో నిర్వహకుడుగా కొంతకాలం పనిచేశారు.
 
పత్రికా రంగంలో వీరు తన ప్రతిభను ప్రదర్శించారు. [[విశాఖపట్నం]] నుండి వెలువడిన '[[స్వశక్తి]]' అను జాతీయ వారపత్రికకు సహాయ సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. '[[ఆంధ్రపత్రిక]]' కు స్వకీయ విలేఖరిగా పన్నెండేళ్ళు వ్యవహరించారు. '[[సత్యవాణి]]' పత్రికను నిర్వహించుచు ఆయన రాసిన సంపాదక వ్యాసాలు పునర్ముద్రణ గౌరవాన్ని పొందాయి. వీరు ప్రచురించిన '[[వైశాఖి]]' మాసపత్రిక సారస్వత ప్రియుల మన్ననలను ఆర్జించింది.
 
[[గ్రంథాలయోద్యమం]]లో వీరు సాగించిన కృషి గణనీయం. [[మంతెన ఆదినారాయణ స్వామి]] స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ప్రథమ గ్రంధాలయాన్ని, '[[కవితా సమితి]]' గ్రంథాలయాన్ని ఆయన చక్కగా అభివృద్ధి పరచారు. [[శ్రీరామవరం]], [[పార్వతీపురం]]లలోని గ్రంథాలయాలను చాలా పెంపొందించారు. [[మరకాం]] గ్రామాన ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ యావజ్జీవ గౌరవ సభ్యులుగా వీరు ఎన్నుకోబడినారు.