చిరుతల రామాయణం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 11:
వచ్చి తీరాలి. ఈ విధంగా ఒక మాసం రోజులు గురువు బృంద సభ్యులతో [[రామాయణం]] శిక్షణ ఇస్తాడు. అభ్యాసం అయిన తరువాత రామ పట్టాభిషేకం వుంటుంది. ముఖ్యంగా సీతారామ పాత్రలు ధరించే వారు. ధనవంతుల ఇళ్ళలో చీరలు, పంచెలు, నగలు సంపాదించి వేషధారణను సమకూర్చు కుంటారు. విశాలమైన స్థలంలో రామాయణానికి సంబంధించిన సన్నివేశాల ననుసరించి సినిమా సెట్సు మాదిరి, రావణాసురుని లంక, అయోధ్య, కిష్కింద, ఇలా వేరు వేరు భాగాలను కట్టెలతో మంచెల్లాగా నిర్మిస్తారు.
[[File:Chirutala bajana at Hyderabad Book fair (1).JPG|thumb|right|పాట పాడుతున్న చిరుతల బజన కళాకారులు]]
ఒక్కో పాత్ర ప్రవేశించి పరిచయం చేసుకునే సమయంలో ప్రేక్షకులు కరతాణ ధ్వనులతో వారిని ఉత్సాహ పరుస్తారు. ఇలా రాత్రంతా రామాయణం గానంచేసి, ఉదయం శ్రీ రాముని పట్టాభిషేక మహోత్సవం చేస్తారు.
వీ వుత్సవానికి ఊరి జనమంతా కదిలివస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతారాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు సీతపెట్టి, దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో కొలిచినట్లే కొలుస్తారు. ఈనాడు చిరుతల రామాయణం సినిమాలు వచ్చిన తరువాత వీటి పట్ల కొంచెం ఆధరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్ యువజన సంఘం, తోటపల్లి, చెర్ల బూత్కూరు, చింతకుంట, [[వీణవంక]] గ్రామాల్లో చిరుతల రామాయణ బృందాలు ఈనాటికి పనిచేస్తున్నాయి.
==మూలాలు==
|