రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==జీవిత విశేషాలు==
రఘుపతి వెంకటరత్నం నాయుడు [[1862]], [[అక్టోబరు 1]] న [[మచిలీపట్నం]] లో సుప్రసిద్ద [[తెలగ]] నాయుళ్ళ ఇంట జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. [[హిందీ]], [[ఉర్దూ]], [[పర్షియన్]] భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి [[హైదరాబాదు]] బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత [[మద్రాసు]] క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాలను గురించి పట్టించుకోరాదు అనే వారామె.