సాక్షి రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81:
 
 
'''సాక్షి రంగారావు''' ([[సెప్టెంబర్ 15]], [[1942]] - [[జూన్ 27]], [[2005]]) పూర్తి పేరు '''రంగవఝుల రంగారావు'''. [[గుడివాడ]] వద్ద నున్న [[కొండిపర్రు]] గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రులు రంగనాయకమ్మ, లక్ష్మినారాయణ. ఈయన నటించిన మొదటి సినిమా [[1967]]లో విడుదలైన బాపూ-రమణల [[సాక్షి (సినిమా)|సాక్షి]]. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. [[బాపు]], [[కె.విశ్వనాథ్]] , [[వంశీ]] తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు [[సాక్షి శివ]] కూడా నటుడే. ఆయన సుమారు 450 సినిమాల్లో నటించాడు. <ref>http://www.hindu.com/2005/06/28/stories/2005062818720500.htm</ref>. ఆంధ్రా[[ఆంధ్ర విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]లో స్టెనోగ్రాఫర్ గా పనిచేసేటప్పుడే ఆయన కిష్టమైన నాటకరంగంలో విరివిగా పాల్గొనేవాడు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రల్లో నటించినా, [[సిరివెన్నెల]], [[స్వర్ణకమలం]], [[ఏప్రిల్ 1 విడుదల]], [[జోకర్]] మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్యనటునిగా ప్రాముఖ్యం కల్పించాయి.
 
ఆయన నటించిన చివరి సినిమా [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[స్వరాభిషేకం]]. 2005, మే 5 వతేదీన గురజాడ వారి నాటకం [[కన్యాశుల్కం (నాటకం)]] లో గిరీశం పాత్రకు ఆయన రిహార్సల్ చేస్తుండగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తరలించిన తరువాత తుదిశ్వాస విడిచారు. ఆ నాటకంలో ఆయనకది డ్రీమ్ రోల్ అని తరచూ చెబుతూ ఉండేవారు.
"https://te.wikipedia.org/wiki/సాక్షి_రంగారావు" నుండి వెలికితీశారు