దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''దామోదరం సంజీవయ్య''' ([[ఫిబ్రవరి 14]],[[1921]] - [[మే 8]],[[1972]]) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రెండవ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]] మరియు తొలి దళిత ముఖ్యమంత్రి. సంయుక్త [[మద్రాసు రాష్ట్రము]]లో, [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రము]]లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మరియు కేంద్ర ప్రభుత్వములో అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించాడు. రెండుసార్లు అఖిల భారత [[కాంగ్రేస్]] కమిటీ అధ్యక్షుడు అవడము కూడా ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయన కాంగ్రేసు పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది.
 
==బాల్యము మరియు విద్యాభ్యాసము==
పంక్తి 25:
 
==ఉద్యోగాలు==
ఆ తరువాత చిన్నయ్య ఆర్ధిక సహాయముతో [[అనంతపురం]] [[ప్రభుత్వ సీడెడ్ జిల్లాల కళాశాల]] లో గణితము మరియు ఖగోళ శాస్త్రములు అధ్యయనము చేశాడు. [[1942]]లో బీ.ఏ పూర్తి చేసిన తర్వాత జీవనోపాధి కొరకు అనేక చిన్నా చితక ఉద్యోగాలు చేశాడు. అప్పుడు [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ధము]] వలన ఉద్యోగాలు దొరకడము చాలా కష్టముగా ఉన్నది. సంజీవయ్య కర్నూలు పట్టణ రేషనింగ్ ఆఫీసులో గుమస్తాగా 48.80 రూపాయల జీతముతో ఉద్యోగములో చేరాడు. 1944 లో కొంతకాలము మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD) కార్యాలయములో సహాయకునిగా పనిచేశాడు. 1945 జనవరిలో కేంద్ర ప్రజాపనుల శాఖా తనిఖీ అధికారిగా బళ్లారిలో పనిచేశాడు. ఈ గజెటెడ్ హోదా కల ఉద్యోగము డిసెంబర్ 1945 లో రద్దయ్యేదాకా 11 నెలల పాటూ పనిచేశాడు. ఆ తరువాత కొంత సమయము మద్రాసులోని[[మద్రాసు]]లోని పచ్చయప్ప పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసాడు.
 
సంజీవయ్య [[1946]] లో అప్పటి బళ్లారి జిల్లా జడ్జి కే.ఆర్.కృష్ణయ్య చెట్టి ప్రోత్సాహముతో మద్రాసు లా కాలేజీలో 'ఎఫ్.ఎల్' (F.L) లో చేరాడు. అప్పట్లో కాలేజిలో స్కాలర్‌షిప్ప్లు ఇచ్చే పద్ధతి ఉండేది కాదు. అందువలన సంజీవయ్య మద్రాసు జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ ఉన్నత పాఠశాల లో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఇచ్చే 90 రూపాయల జీతముతో హాస్టలు ఖర్చులు భరించేవాడు.
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు