పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:ప్రసిద్ధ శైవక్షేత్రాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
[[File:Pushpagiri Temple in Kadapa District.jpg|thumb|250px|పుష్పగిరి దేవాలయం]]
ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే [[కాశీయాత్ర చరిత్ర]]లో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన
==పేరు వృత్తాంతం==
ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యౌవనం లభించేది, అమరత్వమూ సిద్ధించేది. దేవతలు భయపడి [[శివుణ్ణి]] ఆశ్రయించారు. శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్క ను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే పుష్పగిరి అయింది.
పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని '''పంచనదీక్షేత్ర'''మంటారు.
పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. [[కిరాతార్జున]] గాథ చిత్రించబడింది. [[నటరాజ]] నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.
==హరిహరాదుల క్షేత్రం==
|