మింటో-మార్లే సంస్కరణలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ using AWB
పంక్తి 1:
'''మింటో-మార్లే సంస్కరణలు''' 1909
==పూర్వోత్తర సందర్భం (Background)==
భారతదేశములోని బ్రిటిష్ ఇండియా చరిత్రలోని ఒక అంశం. 1907-1908 మధ్యకాలం లో అనేక రాష్ట్రములలో ముఖ్యముగా వంగ రాష్ట్రములోనూ, పంజాబులోనూ దేశాభిమానము విప్లవమార్గం పట్టి విప్లవోద్యమ పరిస్తితులు చాల తీవ్రముగా విఝృంభించాయి. అప్పుడు ఉగ్రవాదములనణుచుటకు బ్రిటిష్ ప్రభుత్వమువారు చేపట్టిన అనేక ప్రతి క్రియలలో నేరముల ప్రోత్సాహ చట్టము ప్రయోగించి పత్రికలను మూతవేశారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధులను (ఉదాహరణ లాలా లజపత్ రాయి) 1818 రెగ్యులెషన్ క్రింద న్యాయవిచారణలేకనే జైలులో నిర్భందించి, ప్రవాసములపంపిచారు. అటువంటి అత్యవసర రెగ్యులేషనలను అమలుచేసి బ్రిటిష్ ప్రభుత్వమువారు ప్రజల స్వేచ్ఛా స్వతం త్య్రములను నాశనముచేసి, ప్రజాభిప్రాయము నణగత్రొక్కటానికి తీవ్ర నిర్భందములకు గురిచేయుచుండిరి. ఆ పరిస్తితులు స్వరాజ్యకాంక్షించు మితవాదులకే కాక బ్రిటిష్ ప్రభుభక్తులను గూడా వ్యాకల పరిచినవి. వారిని బుజ్జగించి చేరదీయుటకు గౌరవ బిరుదులు గౌరోద్యగములిచ్చి తృప్తిపరచదలచ టమే కాక శాసన పూర్వకమైన సంస్కరణలమవసరమని తలచి చట్టము తయారు చేశారు.
 
==సంస్కరణ వివరాలు==
భారతదేశములో అప్పటి రాజప్రతినిధి(గవర్నర్ జనరల్) యగు మింటో ప్రభువు(Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో చట్టముగా ఆమోదించబడి ప్రభుత్వము అమలు పరచినది. ఆ 1909 శాసనమునే మింటో-మార్లే సంస్కరణములనబడింది. మింటో పూర్తి పేరు గిల్బర్టు ఎలియట్ ముర్రే,( కెనడాలోని మింటో పరగణాకు ఎరల్ GILBERT ELLIOT MURRAY,EARL OF MINTO). ఎరల్ అంటే మార్కిస్ అను తరగతి హోదా కన్నా అధికమైన తరగతి కల ఆంగ్ల ప్రభువు . ఎరల్ మింటో భారతదేశమునకు (1905-1910) మధ్యకాలంలో గవర్నర్ జనరల్ గానుండిన దొర. మోర్లే(పూర్తి పేరు జాన్ మోర్లే, JOHN MORLEY) ఆ 1909 శాసనంవల్ల శాసనసభలు నిర్మించి అందు వారికి అనుకూలురగు మితవాదులను గులాములగు జమీందారులను సభ్యులుగాచేసి ప్రజాప్రాతినిధ్యమనిపించారు. పేరుకు సంస్సరణాలైనా వాటి అంతరార్ధము రాజ్యతంత్రమే అని చరిత్ర సమీక్షవలన తెలియును. మింటోదొర భారతదేశములో రాజ్యప్రతినిధి గా చేసిన రాజకీయతంత్రము హిందుా ముసల్మానుల కి వైరం రగిలించటానికి అప్పటిలోఆంగ్లేయులకి మిత్రుడైన [[ఆగాఖాను]] గారి ద్వారాకోరించబడినది ముసల్మానులకి ప్రత్యేక ప్రాతినిధ్యత్వం. బ్రిటిష్ ప్రభుత్వమువారే మింటోమార్లే సంస్కరణములందు చేర్చారు. మహమ్మదీయులకే కాక ఇతర వర్గములవారికిగూడా అలాంటి ప్రత్యేక ప్రాతినిధ్యమునిచ్చుటకు రాజ్యాంగ సంస్కరణలు చేశారు. అటువంటి ప్రత్యేక ప్రాతినిధ్య పధ్ధతికి మార్లేదొర అభ్యతరం చూపినట్లుగా మార్లేదొర రచించిన Recollections of Lord Morley కనబడుచున్నట్లు మూలాధార పుస్తకములో ఉల్లేఖించబడినది. <ref> The British Rule in India. D.V.SivaRao (1938) ఆంధ్ర గ్రంధాలయగ్రంథాలయ ముద్రాక్షరశాల, బెజవాడ 02/10/1938 పేజీలు 370-374</ref>.
 
==మూలాలు==