వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ using AWB |
|||
పంక్తి 27:
}}
'''వారన్ హేస్టింగ్సు''' జీవిత కాలం 1732-1818. కార్యకాలం 1750-1785. క్రీ.శ 1599 లో స్థాపించినప్పటినుండీ బ్రిటిష్ [[ఈస్టిండియా కంపెనీ]] అనువ్యాపార సంస్ధకి పది-పదిహేను సంవత్సరముల కొకమారు ఇంగ్లండులోని బ్రిటిష్ ప్రభుత్వము సన్నదులు (పట్టా) ద్వారా ( ఉదాహరణకు 1661,1676,1686 చేసిన సన్నదులు.1686 లో శాసన నిర్మాణాధికారము ఇచ్చారు,1767 లో అమలుచేసిన కంపెనీ పట్టా చట్టం) ఇత్యాతులు వ్యాపారనిర్వాహణ నిమిత్తం అన్న ఆర్భాటంతో అనేక పరిపాలనాధికారములను క్రమేణా కలిగించారు. ఇవన్నీ బ్రిటిష్ రాజ్యతంత్రములోభాగములే. 1773 లో ఇంకా అధిక మోతాదులో అధికారమిస్తూ రెగ్యులేటింగ్ చట్టం అని అమలుచేశారు. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టము యొక్కఉద్దెశ్యము భారతదేశమును ఇంగ్లండు రాణీగారి పేర పరిపాలించే బ్రిటిష్ పార్లమెంటు పరిపాలనా పరిధిలోకి తీసుకుచ్చి బ్రిటిష్ వలసరాజ్య స్థాపనబలపరచటమే. ఆ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ కి కలకత్తా లో గవర్నర్ జనరల్ పదవి కలుగచేసి బ్రిటన్ దేశ రాజ్యప్రతినిధినిగా నియమించటం జరిగింది. పరిపాలనా సంఘ(గవర్నింగ్ కౌన్సిల్ ) సభ్యత్వం నలుగురినే చేశారు. ఆ చట్టప్రకారం బీహారు ఒరిస్సా రాష్టములు గూడా గవర్నర్ జనరల్ పరిపాలనాధికారంలోకి వచ్చినవి. అంతే కాక మద్రాసు, బొంబాయి రాష్ట్ర గవర్నర్లులుపై తనిఖీకి అధికారము, రాజ్యపాలిత ఇతర అధికారములు ఇవ్వబడ్డాయి. కలకత్తాలో సుప్రీంకోర్టు నియమించబడింది. ఆ చట్టముక్రింద అప్పటిలోకలకత్తాలో గవర్నరు గానున్న వారన్ హేస్టింగ్సు(WARREN HASTINGS) మొట్టమొదటి గవర్నర్ జనరల్ పదవిలో 1773 నుండీ 1785 దాకా బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెని వారిద్వారా బ్రిటిష్ వలసరాజ్యమును పరిపాలించాడు.<ref name=
==వ్యక్తిగతముఖ్యాంశాలు==
వారన్ హేస్టింగ్సు వ్యక్తిగతంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. 1732 డిసెంబరు 6 తేదీన ఇంగ్లండులోని చర్చిల్(CHURCHILL) దగ్గర గ్రామంలో ఒక బీదకుటుంబమున జన్మించి చిన్ననాటనే తల్లిని కొల్పోయాడు. తండ్రి, పినాస్టన్ హేస్టింగ్సు (PYNASTON HASTINGS)కూడా దూరమైపోవటం వల్ల కొంతకాలం ధర్మసంస్థల, అనాధ పాఠశాలలో చదివి, తరువాత బంధువుల పర్యవేక్షణలో పెరిగి లండన్ నగరములోనున్నప్రముఖమైన (WESTMINSTER) పాఠశాలలో విద్యార్ధి గాచదువుతూ చదువు పూర్తికాకముందే కుటుంబ ఆర్ధిక కారణములవల్ల 17 వ ఏటనే 1750లో బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ వంగరాష్ట్ర ముఖ్య కేంద్రమైన కలకత్తా లో గుమాస్తాగా(writer) ప్రవేశించాడు. స్వంతవ్యాపారాలు సర్వసాధారణమైన ఆరోజులలో తనుగూడా కొంత వ్యాపారంచేశాడు. 1753 లో వంగరాష్ట్రములో పనిచేస్తున్న కాలంలో వంగరాష్ట్ర నవాబు సురజ్ ఉద్దౌలా 1757 లో కలకత్తా ముట్టడించినప్పడు బందీ గా పట్టుబడి ముర్షీదాబాదులో బంధించబడి తప్పించుకుని ఆంగ్లేయులున్న హుగ్లీ నదీతీరందగ్గర ఫాల్టాకు చేరుకుని అక్కడవున్న రోజులలోనే మేరీ బుక్నాన్ ( Mary Buchanan) తో వివాహంచేసుకున్నాడు. దురదృష్టవశాన అతని భార్య1759 లోనూ, తరువాత కుమారులు కూడా చిన్నవయస్సులోనే మరణించారు. తరువాత 1777 లో జర్మనీదేశస్తురాలగు ఇమ్హాఫ్ (Baroness IMHOFF) ను వివాహముచేసుకున్నాడు. వంగరాష్ట్రమే హేస్టింగ్సుకు కర్మభూమైనది. వంగరాష్ట్రపు కంపెనీ కౌన్సిల్ లోని ఆంతరంగిక వ్యాకుల పరిస్తితుల వల్ల 1765లో రాజీనామా చేసి ఇంగ్లండుకు తరలిపోయాడు.ఆర్ధిక ఇబ్బందులవల్ల మూడేండ్ల తరువాత 1768 లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. 1769లో చెన్నపట్నంలోని కంపెనీవారి కౌన్సిల్లోసభ్యునిగా వచ్చాడు. తరువాత వృత్తిరీత్యా త్వరితగతి పదోన్నతులతో గవర్నరుగానూ, గవర్నరు జనరల్ గానూ అత్యున్న పదవికి చేరుకున్నప్పటికీ కార్యకాలం చివరిలో (1785) పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. కార్యవిముక్తి అనంతరం చాల తంటాలుఎదురుపడినవి. బ్రిటిష్ ఇండియాలోతన కార్యకాలం జరిగిన అక్రమబధ్ధమైన ఆర్ధిక, రాజకీయ కార్యాచరణలకు అతనిని భాధ్యితునిగా నేరారోపణజరిగింది. లండన్ కామన్సు సభ్యులుగానున్న ఫిలిప్ ఫ్రాన్సిస్ (Philip Francis), జేమ్సు ఫాక్సు( James Fox), ఎడ్మండ్ బర్కే(Edmund Burke) దొరల ఆరోపణలు,అక్రమసంపాదన,రాజ్య దుష్పరిపాలన మొదలగు ఆక్షేపణలపై (impeachment) సంవత్సరములతరబడి జరిగిన విచారణ తరువాత చివరకు నేరవిముక్తుడు గా ఘోషించబడి బయటపడ్డాడు. కానీ వృధ్దాప్యంలో ఆర్దిక ఇబ్బందులకు గురై ప్రభుత్వమువారిని మనోవర్తి యాచించి 86 వ ఏట 1818 ఆగస్టు 22తేదీన ఇంగ్లండులోని డెల్స్ ఫర్ట్(DAYLESFORD) గ్రామము లో మరణించాడు. సశేషం.
==కార్యకాల ముఖ్యాంశాలు==
1750 లో మొట్టమొదటిసారిగా భారతదేశములో ఈస్టుఇండియా కంపెనీ కలకత్తా లో (writer) గుమాస్తాగా పనిలోప్రనేశించి తరువాత కంపెనీవారి ఒక ప్యాక్టరీకి నిర్వాహకుడుగా చేశాడు. 1753లో వంగరాష్ట్ర రాజధాని [[ముర్షీరాబాదు]] కి సముద్రతీర వ్యాపార కేంద్రమైన [[ఖాసింబజారు]]లో పనిచేశాడు. 1757 ప్లాసీ యుధ్ధమప్పుడు ఇతని నైపుణ్యమును గుర్తించిన రాబర్టు క్లైవు యుధ్ధానంతరం కలకత్తాను విడిపించి తన అనుగ్రహ పాత్రుడైన [[మీర్ జఫర్]] ను నవాబుగా చేసి ఆ నవాబుగారి రాజధాని ముర్షీరాబాదు లో 1758లో హేస్టింగ్సు ను కంపెనీ ప్రతినిధిగానూ(Resident), నవాబుగారి సలహాదారునిగా వ్యవహరించుటకు నియమించాడు. 1761 లో పదోన్నతి తో కంపెనీ పరిపాలక యంత్రాంగమైన (కౌన్సిల్) సంఘ సభ్యునిగా కలకత్తా లో నియమింపబడ్డాడు. 1761-1765 నాలుగేండ్లలో వంగరాష్ట్రములోని పరిపాలన, కంపెనీ ఉద్యోగుల అవినీతి, లంచగొండితనం, స్వంతవ్యాపారములు, ప్రజాపీడనలు చాలా విషమస్తితికి దారితీశాయు. (చూడు[[
=== వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు===
వంగరాష్ట్ర గవర్నర్ గా 1772లో పదవీ స్వీకారంచేసిన తరువాత వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలు (1)ప్రబుత్వ యంత్రాంగమును కదలించి వంగరాష్ట్ర రాజధానిని ముషీరాబాదునుండి కలకత్తా తరలించాడు. 1767 కంపెనీ చట్టప్రకారము కంపెనీ రాబడి లో కొంత భాగము బ్రిటిష్ ప్రబుత్వమువారికి కట్టవలసినదేకాక, తమ కంపెనీకి కూడా కట్టవలసివచ్చెను. దాంతో బ్రిటిష్ ఇండియా పరిపాలకసంఘం ఆర్దికస్తితి దిగజారుతూ ఋణగ్రస్తములోకి దిగింది. అందుకని వారనా హేస్టింగ్సు అనేక మార్గములద్యారా ఆదాయం పెంపొందిప నిశ్చయించాడు. (2) వంగరాష్ట్ర నవాబు అధికారమునుండి తొలగించునప్పుడు రాబర్టు క్లైవు చేసిన వప్పందంప్రకారం సాలునా ఇయ్యవలసిన అలవెన్సు 53 లక్షలను క్లైవు కాలంలోనే రెండవనవాబు పదవిలోకి వచ్చినప్పుడు 41 లక్షలకు తరువాత వచ్చిన ఇంకో కొత్తనవాబుకు 32 లక్షలకు తగ్గించబడినదానిని గవర్నర్ వారన్ హేస్టింగ్సు ఇంకా తగ్గించి 16 లక్షలకు చేశాడు, అలాగే ఢిల్లీలోని చక్రవర్తిషా ఆలం కి క్లైవుచేసిన వప్పందం ప్రకారం ఇయ్యవలసిన ఇరవైఆరు లక్షలరూపాయల సాలూనాచెల్లించు కప్పమును మొత్తం ఆపేయటమేకాక షా ఆలం కు క్లైవు ఇచ్చిన [[అల్ హాబాదు]] పరణాలనూ, [[కోరా]] పరగణాలనూ(పశ్చమ ఒరిస్సాలో ని ప్రాంతం) వెనక్కి తీసేసుకుని అయోధ్య(అవధ్)షూజా ఉద్దౌలా నవాబుకు 50లక్షల రూపాయలకు వెచ్చించటమే కాక, మరాఠా దండులు [[రోహిల్లా]] మీదకు దాడికి వస్తే సైనిక సహాయంచేయటానికి ఇంకా నాలుగులక్షలు నవరసులు వసూలుచేశాడు. వంగరాష్ట్ర నవాబు ను, చక్రవర్తి షా ఆలమునూ దుస్తితి కి పాల్చేశాడు. (3)వంగరాష్ట్రమును కొన్ని జిల్లాలుగావిభజించి పన్నుల వసూలుకొరకు ప్రాతదేశీయోద్యుగులను తొలగించి జిల్లాకొక కలెక్టరును, నలురైదుగురు కలెక్టర్లపై ఒక కమీషనరు ను నియమించాడు. వీరందరిపైనా కలకత్తాలో రెవెన్యూబోర్డును ఏర్పరచాడు. కలెక్టర్లు సరాసరి పన్నులు వసూలుచేయకుండా పన్నుల వసూలుహక్కును ఆ విధముగా వేలంవేయించి వేలంపాట లో ఎవరైతే అధికంగా పాడిరో వారికి సిస్తు వసూలు చేసే హక్కు ఇచ్చారు. అలాగ సిస్తు వసూలు చేసుకున్నవారే[[ఇజారాదారులు]] . ఆ ఇజారా దారులునే మొదట దివానులనేవారు. తరువాత వారిలో చాలమంది [[కారన్ వాలీసు]] కాలం(1786-1793) లో చేసిన సంస్కరణల పలితముగా జమీందారులైయ్యారు. (4) జిల్లా కలెక్టర్లకే రివిన్యూ భాద్యతలుతోపాటు న్యాయవిచారణచేయు అదికారమీయబడినది. కలెక్టర్ల కోర్టులే క్రిందికోర్టు, దానిపైన అప్పీలు కోర్టును సదర్ దివానీ అదాలత్ అను సివిల్ కోర్టును, సదర్ నిజామత్ అదాలత్ అను రెండు ఉన్నత కోర్టులను స్థాపించబడ్డాయి. అలా వారన్ హేస్టింగ్సు చేసిన రాజకీయ సంస్కరణలవల్ల నూతన న్యాయస్తానాలు నెలకొల్పబడనవి, న్యాయ విచారాణాధికారము ఇంగ్లీషువారు చేబట్టి ఆంగ్లేయధర్మశాస్త్రములను అమలుచేయటంవల్ల దీర్ఘకాలంనుండీవస్తున్న హిందూ మహ్మదీయ సాంప్రదాయలకు ఆటంకమైనవి. సశేషం
పంక్తి 40:
====రోహిల్ఖండు చరిత్ర, రోహిల్ఖండు యుద్ధం (1773-1774) ====
రోహిల్ఖండు ఉత్తరహిందూదేశములో ఇప్పటి ఉత్తరాఖండు రాష్ట్రములో వాయవ్యదిశన నేపాలు దాకా యుండిన పరగణాలు మొగల్ చక్రవర్తి 17 వశతాబ్దములో అఫగన్ ధేశీయులగు [[రోహిల్లాలు]]అను [[పధానులు]]కిచ్చాడు. అందువల్ల ఆ పరగణాలుగల రాజ్యమును రోహిల్ఖండు అనబడియున్నది. ఆ రాజ్యములో ఇప్పటి[[బరైలీ]], [[రుద్రపూరు]], [[రామ్ పూరు]], [[మొరాదాబాదు]] మొదలగు పట్టణములున్న జిల్లాలు కలవు . 1752లో రోహిల్ ఖండుకు ఆనుకుని యున్న [[
====రెండవ మైసూరు యుద్ధం (1780-1784)====
రెండవ మాసూరు యుధ్ధం 1780లో [[హైదర్ అలీ]] [[ఆర్కాటు]] ను ముట్టడించడం అతని కుమారుడు [[టిప్పుసుల్తాన్]] పోలిలూరు (పెరంబాగం)లో బ్రిటిష్ వారిసైన్యాదిపతి కర్నల్ [[విలియం బైలీ]] (William Baillie) ని యుద్ధములో ఓడించి [[శ్రీరంగపట్టణం]] లో బందీగానుంచటం. అలాగే ఇంకో బ్రిటిష్ సైన్యదిపతి బ్రైత్వైట్ (Braithwait) ను కుంబకోణంలో ఓడించి శ్రీరంగపట్టణం లో బందిగానుంచాడు. ఆయుద్ధమువలన బ్రిటిష్ వారి కి చలా తీవ్రమైన ఓటమి తీరని అపర్దిష్ట కలిగింది. అప్పుడు వారన్ హేస్టింగ్సు తన సేనాధిపతి ఐర్ కూట్ (Eyre Coote) ను హైదర్ అలీ పై యుద్ధమునకు పంపాడు. పోర్టోనోవో (పరంగిపెట్టై) లో 1782 జరిగిన ఆ యుద్దము లో హైదర్ అలీ ఓడిపోయిన తరువాత మరణించాడు. 1783లో ఐర్ కూట్ కూడా మరణించాడు. టిప్పుసుల్తాను తన తండ్రితదనంతరం బ్రిటిష్ కంపెనీ వారితో వైరం ఇంకా కొనసాగించగా అప్పటి బ్రిటిష గవర్నర్ జనరల్ [[
====మొదటి మహారాష్ట్రయుధ్దము (1775-1782)====
బ్రిటిష్ కంపెనీ వారు మహారాష్ట్ర రాజ్యములో ఏడేండ్ల పాటు (1775-1782) చేసిన మొదటి యుధ్దము వారన్ హేస్టింగ్సు కార్యకాలములోనే జరిగింది. అప్పటిదాకా కంపెనీ వారు సరాసరి మహారాష్ట్ర రాజ్య పరిపాలకులతో యుద్దమునకు తిగలేదు. శివాజీ మహారాజు స్థాపించిన మహారాష్ట్రరాజ్యము భౌగోళికముగా ఇప్పటి మహారాష్ట్ర రాష్ట్రమే గాక, కెొంకణ ప్రాంతములోను, దక్కను పరగణాలలోను, ఇప్పటి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఇందోరు మొదలగు మాల్వా ప్రాంతములు లో విస్తరించిన యున్న సామ్రాజ్యము. మహారాష్ట్ర రాజ్యమును స్తాపించిన శివాజీ మహారాజు తరంవారు 1714 నుండీ బలహీనులైన కారణంగా ఆ రాజ్య మంత్రిపరిషత్తునందలి పీష్వా అను ప్రధాన మంత్రులే వారసత్వంతో పరిపాలించు చుండిరి. వీరి కాలములో రాజధానిని [[రాయఘడ్]] నుండి [[పూనా]] కు మార్చబడినది. అట్టి పీష్వాల తరంవారిలో నాల్గవ పీష్వా మాధవరావు (1761-1772) క్షయవ్యాధితో 1772 లో మరణించుచూ 16 ఏండ్ల బాలుడైన తనతమ్ముడు నారాయణరావుకు తనతరువాత పట్టాబిషేకముచేయమని మంత్రిపరిషత్తుకు చెప్పి మరణించాడు. నారాయణరావును పీష్వాగా చేసినతరువాత మాధవరావు గారి పినతండ్రైన [[రఘునాధరావు]] కుట్రలు పన్ని నారాయణరావును చంపి తానే పీష్వాగా పరిపాలనచేపట్టాడు కానీ మంత్రి పరిషత్తులోని కొందమంది [[నానాఫడ్నవీసు]] సారధ్యములోని వారు అతనిని పదవినుండి తొలగమని అప్పుడే పుట్టిన నారాయణరావు కుమారుడు [[సవాయి మాధవరావు]] అను పసికందుకు పట్టముకట్టారు. అంతట రఘునాదరావు బ్రిటిష ఈస్టు ఇండియా కంపెనీ బొంబాయి గవర్నరు ను ఆశ్రయించి తనకు సైనికి సహాయంచేయమని, దానికి ప్రతిఫలముగా తను మహారాష్ట్ర రాజ్యములోని కొన్ని భూభాగములను ( [[సల్సెట్టీ]], [[బస్సీను]] ) ఇవ్వటమేకాక [[సూరత్]] లోను, [[బరూచ్]] లోను రాజస్వ హక్కు కూడా ఇచ్చేటట్లుగా సూరత్ లో 1775 మార్చిలో సంధిపత్రము వ్రాసి వప్పందం కుదుర్చుకున్నాడు. అదే సూరత్ సంధి. అ సంధి ప్రకారము లభించిన బ్రిటిష్ వారి సైన్యసహాయంతో సూరత్ నుండి పూనాపై దండయాత్రకు బయలుదేరగా దారిలో నానాఫడ్నవీసు పక్షమువారిచే పరాజయము పొందాడు. అంతేగాక కలకత్తాలోని బ్రిటిష గవర్నరు జనరల్ కౌన్సిల్ వారు ఆ సూరత్ సందిని రద్దు పరచుటకు పూనా కు రాయబారముపంపి నానాఫడ్నవీసు తో మార్చి1776 లో [[పురంధర్]] అను ప ట్టణంలో ఇంకో సంధి చేసుకున్నారు. ఆ సంధి ప్రకారం కూడా సూరత్ లోను బరూచ్ లోను రాజస్వహక్కు తమకుండేటటుల. కానీ నానాఫడ్నవీసు పురంధర్ సందికి వ్యతిరేకముగా తన రాజ్యములోని పడమర సముద్రపుతీరమున ప్రెంచివారి కి నౌకాయానమునకు ఓడరేవునిచ్చాడు. దాంతో రఘునాధరావునే మహారాష్ట్ర రాజ్యసింహాసనాధిపతిచేయుటకు బొంబాయ కంపెనీ గవర్నరు సైన్యమును పూనాకు పంపి నానాఫడ్నవీసుతో యుధ్దమునకు దిగారు. కానీ దారిలోనే [[వడగాం]] అను పట్టణం లో నానా ఫడ్నవీసు సైన్యముతో ఓడిపోయి సంధిచేసుకున్నారు అదే వడగాం సంది 1779 లో జరిగి నసంది. అప్పుడు వారన్ హేస్టింగ్సు పెద్దపెట్టున సైన్యమును కర్నల్ థామస్ డబ్ల్యూ గద్దర్ సారధ్యములో యుద్దమునకు పంపి పూనాను ముట్టడించి పరిస్తితిని పూర్తిగా బ్రిటిష్ వారి వశంచేసుకుంటానికి పంపించాడు. అంతట గద్దార్డు సైన్యము [[అహ్మదాబాదు]] ను, [[బస్సీను]] ను ఆక్రమించి పూనా ముట్టడిచేశారు. ఈ లోపల మరో వైపు [[మాళ్వా]] లో బ్రిటిష్ సైన్యాధికారి కమక్ ను మహారాష్ట్రకూటమిలోని [[
==వారన్ హేస్టింగ్సుకార్యకాల సమీక్ష==
=== గవర్నరుకాకమునుపు,1772కు ముందు కార్యాకాలం===
వంగరాష్ట్రములో మొదటివిడతలో 1750-1757, 1757- 1764 కార్యకాలం లోనూ తదుపరి 1768 దేవీకోట చేన్నపట్నంలో కంపెనీ పాలక సంఘములో సాధారణ సభ్యునిగా 1772 దాకా కార్యకాలంలోనూ వారన్ హేస్టింగ్సు చర్యలు, అభిమతాలు భారతదేశ ప్రజల క్షేమంకోరినవిగనూ బ్రిటిష్ వారి రాజ్యతంత్రములు న్యాయ-ధర్మ విరుద్ధములైనవిగనూ, బ్రిటిష్ ఉద్యోగుల ఆర్ధిక అవినీతి చర్యలు ఖండించునవిగనూ,బ్రిటిషదొరలకు అభ్యంతరములై తంటాలు కలిగించేవిగనూ విశదమగుచున్నవి.
===1773 లో విలియం కోటకు గవర్నరు అయన తరువాతనుంచి===
|