వీరనరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1113900 (translate me)
చి AWB తో RETF మార్పులు, typos fixed: చేసినారు → చేసారు (4) using AWB
పంక్తి 3:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
'''వీరనరసింహరాయలు''' విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తుళువ వంశ స్థాపకుడైన [[తుళువ నరస నాయకుడు | తుళువ నరస నాయకుని]] కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం '''వీర నరసింహ రాయలు''' అనే వీరోచిత పేరుతో అధిష్టించినాడు. ఇతని తండ్రి నరస నాయకుడు [[1503]]లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] నందు బందీగా ఉన్న [[సాళువ ఇమ్మడి నరసింహ రాయలు]] పేరుతో 1505 వరకు రాజ్యాన్ని పరిపాలించినాడు. కానీ [[1506]]లో అతనిని హత్యగావించి తనే రాజుగా సింహాసనాన్ని అధిష్టించాడు.
 
===సామంతుల తిరుగుబాట్లు===
వీరనరసింహరాయలు [[సాళువ]] వంశాన్ని అంతమొందించి తనే రాజుగా మారడాన్ని సహించని సామంతులు తిరుగుబాట్లు చేసినారుచేసారు, ముఖ్యంగా [[ఆదోని]] పాలకుడు [[కాసెప్ప ఒడయరు]], [[ఉమ్మత్తూరు]] పాలకుడు [[దేవరాజు]], [[శ్రీరంగపట్నం]] పాలకుడు [[గుండరాజు]]లు తిరుగుబాటు చేసినారుచేసారు.
 
[[బహుమనీ]] సుల్తాను [[మహమ్మద్ షా]] ఆదేశానుసారం అతని సామంతుడు [[యాసుఫ్ ఆదిల్ఖాన్]] [[1502]]లో విజయనగర రాజ్యంపైకి దండయాత్రకు బయలుదేరినాడు. అప్పటికే తిరుగుబాటు చేస్తున్న ఆదోని కాసెప్ప ఒడయారు అతనికి వంతగా తనూ సైనికులను నడిపించినాడు, కానీ [[అరవీటి రామరాజు]] కుమారుడు [[అరవీటి తిమ్మరాజు]] కందనవోలు (కర్నూలు) ప్రాంతాన్ని పరిపాలిస్తూ విజయనగరాధీశులకు సామంతునిగా ఉండెను. అతను ఈ యూసుఫ్ ఆదిల్ఖాన్, కాసెప్ప ఒడయారు సైనికులను మూడు సంవత్సరాలు జరిగిన యుద్ధమందు ఓడించి తరిమేశాడు. ఈ విజయానికి ఆనందించి వీర నరసింహరాయలు అదవాని (అదోని) సీమను [[అరవీటి తిమ్మరాజు]]నకు విజయానికి కానుకగా ఇచ్చినాడు. ఈ సంఘటన వల్ల [[ఆరవీటి వంశము|అరవీటి]] వంశస్తులూ, [[తుళువ]] వంశస్తులూ చక్కని స్నేహితులు అయినారు.
 
వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన [[శ్రీ కృష్ణదేవరాయలు]]ను రాజ్యపాలనకు నియమించి, [[1508]] నాటికి [[ఉమ్మత్తూరు]], [[శ్రీరంగపట్టణము]]లను ఓడించి విజయనగరము వచ్చినాడు, కానీ మరల వీరు తోక జాడించినారు. దానితో ఈ సారి తన సోదరులగు [[అచ్యుత రాయలు]], [[శ్రీరంగ రాయలు]]ను సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో [[కొంకణ]] ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించినాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
 
ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.
 
==దక్షిణ దండయాత్ర==
తరువాత వీర నరసింహరాయలు మరొక దండయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసినాడుపూర్తిచేసాడు.
 
ఈ దండయాత్రలన్నీ ముగిసిన తరువాత వీరు ఆధ్యాత్మిక మార్గంలో పడి [[కంచి]], [[కుంభకోణము]], [[పక్షితీర్థము]], [[శ్రీరంగము]], [[చిదంబరము]], [[శ్రీకాళహస్తి]], [[గోకర్ణము]], [[రామేశ్వరము]], [[త్రిపురాంతకము]], [[అహోబలము]], [[శ్రీశైలము]], [[తిరుపతి]], [[సంగమేశ్వరము]] మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించి అనేక దాన ధర్మాలను చేసినాడుచేసాడు.
 
==వారసుడు==
పంక్తి 31:
<!-- categories -->
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
 
"https://te.wikipedia.org/wiki/వీరనరసింహ_రాయలు" నుండి వెలికితీశారు