తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శ్రీనాధ → శ్రీనాథ (4) using AWB
చి →‎రాజకీయ, సామాజిక నేపథ్యం: clean up, replaced: నేపధ్యం → నేపథ్యం using AWB
పంక్తి 7:
ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి [[పింగళి లక్ష్మీకాంతం]] తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాథునికి ముందు ఎఱ్ఱన, నాచన సోమన, భాస్కరుడు వంటి మేటికవులవతరించారు. అంతేగాక తెలుగు సారస్వతానికి త్రిమూర్తులైన కవిత్రయం తరువాతనే ఎంతటివారైనా పేర్కొనదగినవారౌతారు. ఆ మువ్వురును ఆంధ్ర కవి ప్రపంచానికి గురుస్థానీయులు. కనుక ఆ మువ్వురిపేరు మీద మూడు యుగాలుండడం ఉచితం. అంతేగాక ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాథునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు. కనుక ఎఱ్ఱనను యుగకర్తగా సంభావించుట ఉచితం."<ref name="pingali">పింగళి లక్ష్మీకాంతం - '''ఆంధ్ర సాహిత్య చరిత్ర''' - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
 
==రాజకీయ, సామాజిక నేపధ్యంనేపథ్యం==
1323లో ఢిల్లీ సుల్తాను చేత పరాజితుడై ప్రతాపరుద్రుడు మరణించడంతో [[కాకతీయ సామ్రాజ్యం]] అంతమైంది. అయితే కాకతీయులకు విధేయులైన నాయకులు తిరిగి ఢిల్లీ సులతాను సేనలను ఓడించి ఆంధ్రాపధాన్ని హస్తగతం చేసుకోగలిగారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలలో ఆంధ్రదేశం చిన్న చిన్న భాగాలుగా నాయకుల పాలనలోకి వచ్చింది. కృష్ణానదికు ఉత్తరాన [[ముసునూరు నాయకులు]], రేచెర్ల వెలమ నాయకులు, కృష్ణకు దక్షిణాన రెడ్డి రాజులు రాజ్యం చేశారు. అనంతరం బీజాపూరు బహమనీ రాజులతో జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు. అద్దంకి రాజధానిగా ఉన్న ప్రోలయ వేమారెడ్డి 1325-1353 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. అతని ఆస్థాన కవియే ఎఱ్ఱాప్రగడ.